బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి టింబర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్‌, సివిల్/ఫైర్‌/మెట‌ల‌ర్జి, స్ర్టక్చరల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, పాలీమర్‌ ఇంజినీరింగ్‌/ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఎంటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 107

* కన్సల్టెంట్‌ పోస్టులు

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ సివిల్‌ ఇంజినీరింగ్‌: 15

➥ కెమికల్‌: 06

➥ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 03

➥ ఎలక్ట్రోటెక్నికల్: 06

➥ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌: 06

➥ మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 07

➥ మెడికల్‌ ఎక్యుప్‌మెంట్‌ అండ్‌ హస్పిటల్‌ ప్లానింగ్‌: 02

➥ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌: 09

➥ పెట్రోలియం, కోల్‌ అండ్‌ రిలేటెడ్‌ ప్రొడక్ట్స్‌: 05

➥ ప్రొడక్షన్ అండ్‌ జనరల్‌ ఇంజినీరింగ్‌: 10

➥ టెక్స్‌టైల్‌: 08

➥ ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీరింగ్‌: 07

➥ వాటర్ రీసోర్సెస్‌: 06

➥ సర్వీస్‌ సెక్టార్‌: 08

➥ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సిస్టమ్‌: 05

➥ ఆయూష్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి టింబర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్‌, సివిల్/ఫైర్‌/మెట‌ల‌ర్జి, స్ర్టక్చరల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, పాలీమర్‌ ఇంజినీరింగ్‌/ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఎంటెక్‌తో పాటు సంబంధిత రంగంలో 5-10 సంవత్సరాలు పనిఅనుభవం ఉండాలి.

వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.

కాలవ్యవధి: పూర్తిగా ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టుపై ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: నెలకు రూ.75,000.

జాబ్ లొకేషన్: ఢిల్లీ NCR.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 30.12.2023

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2024

Notification

Website

ALSO READ:

ఒంగోలు జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలిప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

కడప వైద్యారోగ్య విభాగంలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులుకడపలోని వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు లేదా సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...