మచిలీపట్నంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* మొత్తం పోస్టుల సంఖ్య: 54.


➥ ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు


అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ). కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.


జీతం: రూ.36,935.


➥ స్టాఫ్ నర్స్: 24 పోస్టులు


అర్హత: జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 


జీతం: రూ.32,000.


➥ మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌: 08 పోస్టులు


అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఏడాదిన్నర మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం తప్పనిసరి.


జీతం: రూ.27,000.


➥ మెడికల్ ఆఫీసర్: 10 పోస్టులు


అర్హత: ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


జీతం: రూ.53,465.


➥ ఎల్‌జీఎస్‌: 04 పోస్టులు


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


జీతం: రూ.15,000.


➥ సపోర్టింగ్ స్టాఫ్: 3 పోస్టులు


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


జీతం: రూ.15,000.


➥ సెక్యూరిటీ గార్డ్: 1 పోస్టు


అర్హత: ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ లేదా పదోతరగతి అర్హత ఉండాలి.


జీతం: రూ.15,000.


వయోపరిమితి:  01.01.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 


దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
Office of the District Medical and Health Officer, 
Parasupeta, Near Nayarbaddi centre,
Machilipatnam, Krishna district.


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.10.2023.


Notification & Application


Website


ALSO READ:


ఏపీ‌ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.70 వేల జీతం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ), వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన లేదా పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..