AIIMS Rishikesh Recruitment: రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 49

➥ సీనియర్‌ రెసిడెంట్(నాన్‌ అకడమిక్‌) పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ అనస్థీషియాలజీ: 03

➥ అనాటమీ: 01

➥ బయోకెమిస్ట్రీ: 02

➥ ఈఎన్‌టీ: 03

➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 02

➥ జనరల్ మెడిసిన్: 01

➥ జనరల్ మెడిసిన్(జెరియాట్రిక్ మెడిసిన్): 02

➥ జనరల్‌ సర్జరీ: 05

➥ మైక్రోబయాలజీ: 03

➥ న్యూక్లియర్ మెడిసిన్: 04

➥ నేత్ర వైద్యం: 03

➥ పాథాలజీ / ల్యాబ్ మెడిసిన్: 03

➥ పీడియాట్రిక్ సర్జరీ: 01

➥ ఫార్మకాలజీ: 01 ➥ ఫిజియాలజీ: 02

➥ సైకియాట్రీ: 01

➥ రేడియో డయాగ్నోసిస్: 02

➥ రేడియో థెరపీ: 02

➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడ్. & బ్లడ్ బ్యాంక్: 03

➥ ట్రామా & ఎమర్జెన్సీ(ఎమర్జెన్సీ మెడిసిన్): 03

➥ ట్రామా & ఎమర్జెన్సీ(ట్రామా సర్జరీ): 02

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: నిబంధనల మేరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 06.09.2023.

Notification

Website

ALSO READ:

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టులుముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సదరన్‌ రైల్వేలో 790 ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ పోస్టులు - అర్హతలివే!Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏఎల్‌పీ/టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 790 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులుభారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..