కరోనాను కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే మనం నియంత్రించలేనంతగా, అంచనా వేయలేనంతగా వైరస్​ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కొవిడ్​-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుంది.                                           - టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ అధినేత