Singer Theertha About Salaar Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో అలరించనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులో ఓ రేంజిలో ఆకట్టుకుంది. 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది.  ‘ఆదిపురుష్’ పరాభవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


‘సలార్’ సినిమాలో యష్ నటిస్తున్నారంటూ వార్తలు


‘సలార్’ చిత్రంలో ‘కేజీఎఫ్’ హీరో యష్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైల్ట్ సింగర్ తీర్థ సుభాష్ ఈ విషయాన్ని వెల్లడించింది. యష్ ఈ మూవీలో అతిథి పాత్ర చేస్తున్నట్లు వివరించింది. “యష్ అంకుల్', 'ప్రభాస్ అంకుల్', 'పృథ్వీరాజ్ అంకుల్' ఈ సినిమాలో నటిస్తున్నారు” అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, యష్ అభిమానులు ఈ న్యూస్ విని ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా మరో రేంజిలో ఉంటుందని అందరూ భావించారు. వాస్తవానికి ‘సలార్’ స్టోరీ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’లో భాగంగానే ఈ సినిమా వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘సలార్’ టీజర్, ట్రైలర్ లో సైతం ‘కేజీఎఫ్’ పోలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ మూవీ ‘కేజీఎఫ్’కు కొనసాగింపు కావచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే తీర్థ సుభాష్ ఈ మూవీలో యష్ నటిస్తున్నారని చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు.


కీలక విషయాలు వెల్లడించిన సింగర్ తీర్థ సుభాష్


తాజాగా తీర్థ సుభాష్ కామెంట్స్ కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో యష్ నటిస్తున్నారని పొరపాటుగా చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ మేరకు కన్నడ చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. "నేను KGF చిత్రాన్ని చాలాసార్లు చూశాను. మా నాన్నగారు ‘సలార్’ మూవీ మ్యూజిక్ తో పాటు పలు అంశాల గురించి చెప్పారు. ఆ విషయాలను గుర్తు చేసుకుని యష్ అంకుల్ కూడా ‘సలార్‌’లో ఉంటారని భావించాను. అదే విషయాన్ని బయటకు చెప్పాను. నేను పొరపాటుగా ఈ విషయాన్ని వెల్లడించాను. దయచేసి నన్ను ట్రోల్ చేయకండి” అని చెప్పుకొచ్చింది.






'సలార్' మూవీ గురించి..


ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. 'సలార్: పార్ట్ 1’ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రభాస్ ‘సలార్’గా పృథ్వీరాజ్ వరద రాజమన్నార్ గా కనిపించనున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  


Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం