తెలుగు, తమిళ సినిమాలలో దూసుకెళ్తున్న భామ రష్మిక మందన్నా. చేతినిండా సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ భామ. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప సినిమాతో మరింత జోరు పెంచింది. బాలీవుడ్లోకి ‘మిషన్ మజ్ను’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. దీంతో ఫుల్ జోష్ లో ఉంది రష్మిక. ముంబైకి మన బుజ్జి కుక్కపిల్ల ఆరాతో కలిసి మకాం మార్చింది. అక్కడే ఉండి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టబోతోందట ఈ భామ.  


స్వీట్ వార్నింగ్
రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఆమె పెట్టిన పోస్టును ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్న వారికి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఎరుపెక్కిన తన చేయి ఫోటోని పెట్టి ‘మీరు హీరోయిన్‌గా కావాలనుకుంటున్నారా? మంచిదే, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు చాలా సార్లు లేజర్ చికిత్స( చర్మంపై వెంట్రుకలు లేకుండా నున్నగా గీసేస్తారు) చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది నిజంగా చాలా నొప్పి పెట్టేది’ అని మెసేజ్ పెట్టింది. 


‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక. ఆ సినిమా హిట్టు కొట్టడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక గీత గోవిందం సినిమా ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసింది. డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్... ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది రష్మిక. ఇప్పుడు పుష్ప కూడా రష్మిక ఖాతాలో పడింది.   



Also Read: ‘పుష్ప’ విజయం చాలా ఆనందాన్నిస్తోంది... అల్లు అర్జున్‌ను పొగిడేసిన బాలీవుడ్ హీరో
Also Read:  అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read:  బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి