హీరోయిన్ ఆనంది గుర్తు ఉన్నారా? రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియా 'రాజా సాబ్' తెరకెక్కిస్తున్న మారుతి దర్శకుడిగా పరిచయమైన 'ఈ రోజుల్లో' చిన్న రోల్ చేశారు. ఆ తర్వాత 'బస్ స్టాప్' సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు చిన్న సినిమాలు చేశాక... తమిళంలో నటించిన సూపర్ హిట్ 'కాయల్' ఆమె దశను మార్చింది. వరుసపెట్టి తమిళ సినిమాలు చేశారు. 'జాంబీ రెడ్డి', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో మళ్లీ ఆనంది తెలుగు సినిమాలకు వచ్చారు. 


ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే... ఆనంది గత ఏడాది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేశారు. ఇప్పుడు ఆ సినిమా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ వేదికలో విడుదల అయ్యింది.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'విధి'
యువ కథానాయకుడు రోహిత్ నందాకు జంటగా ఆనంది నటించిన సినిమా 'విధి'. నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రంజిత్. ఎస్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. శ్రీనాథ్ రంగనాథన్ కథ రాశారు. అంతే కాదు... ఛాయాగ్రాహకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది నవంబర్ 3న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. 


అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'విధి' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హీరో, 'మా' అధ్యక్షుడు విష్ణు మంచు ట్వీట్ చేయడంతో ఓటీటీలో విడుదలైన విషయం చాలా మందికి తెలిసింది. ''బ్రదర్ రోహిత్ నందాకు ఆల్ ది బెస్ట్. అతని సినిమా 'విధి' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఆల్ రౌండర్ ఎంటర్టైనర్. తప్పకుండా చూడండి'' అని విష్ణు మంచు పేర్కొన్నారు.


Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...






ఆ పెన్నుతో రాస్తే మరణం... విధి కథ ఏమిటంటే?'విధి' సినిమా కథ విషయానికి వస్తే... ఈ సినిమాలో ఒక పెన్ కీలక పాత్ర పోషించింది. ఆ పెన్నుతో ఎవరు రాసినా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఆ పెన్ నేపథ్యం ఏంటి? హీరో చేతికి పెన్ వచ్చిన తర్వాత దాంతో అతను ఏం చేశాడు? అనేది సినిమా. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది.


Also Readనైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?



''డిఫరెంట్ కంటెంట్‌, కొత్త కథలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అలా వచ్చిన చిత్రమే మా 'విధి'. గత ఏడాది థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్  ఇచ్చిందని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్‌ ఓటీటీలో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ వీక్షకులను సైతం ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.