ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). ఈ సినిమాలో క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బురు ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. 


కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. 'వైబ్ ఆఫ్ వినరో భాగ్యము విష్ణు కథ' అనే పేరుతో తాజాగా ఈ సినిమా నుంచి చిన్న వీడియోను రిలీజ్ చేశారు. 'ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయ్.. మాది తిరుపతి.. నా పేరు విష్ణు.. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ' అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఈ వీడియో మొదలైంది.  విజువల్స్, మ్యూజిక్ అన్నీ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.  


ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.