టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda_ నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ నెల మొత్తం కూడా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా.. ఇప్పుడు మరికొన్ని సిటీలకు వెళ్లనున్నారు. దేశం మొత్తం తిరుగుతున్న తన కొడుకు సేఫ్ గా ఉండాలంటూ విజయ్ తల్లి ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించారు. 


వేదపండితులను తీసుకొచ్చి మరీ ప్రత్యేక పూజలు చేయించారు. తన తల్లి ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించారు విజయ్. ఈ క్రమంలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. 'ఈ నెల మొత్తం ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే చాలా నగరాలు తిరిగాం. ఎంతో ప్రేమను పొందాం. కానీ మా అమ్మ రక్షణ అవసరమని భావించింది. అందుకే ఇంట్లో పూజ చేసి, అందరికీ తాయత్తులు కట్టింది. ఇక మేం ప్రయాణం కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది' అంటూ రాసుకొచ్చారు విజయ్. 






విజయ్ షేర్ చేసిన ఫొటోల్లో అనన్య పాండే(Ananya Panday) కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదట్నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.


ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?


Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ