Varun Sandesh Gets Emotional In Suma Adda Show, Watch Latest Promo: నటుడు వరుణ్ సందేశ్... ‘విరాజి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ‘సుమ అడ్డా’ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ తన కెరీర్ గురించి, స్ట్రగులింగ్ పీరియడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ లాంటి హిట్స్ మళ్లీ రావాలని వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. “హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’ నా కెరీర్ లోనే పీక్ హిట్స్. అలాంటి హిట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ సినిమాల మాదిరి సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాను. వితిక షేరు నా పక్కన లేకుంటే ఏం చేసేవాడినో నాకే తెలియదు” అని చెప్పారు. ఇక ‘జబర్దస్త్’ నూకరాజు షోలో చేసిన కామెడీ అందరినీ ఎంత గానో ఆకట్టుకుంది.  



వరుస సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్


‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ మూవీ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘నింద’ చిత్రం విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘విరాజి’ అనే సినిమా చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను నూతన దర్శకుడు ఆద్యంత్ హర్ష తెరకెక్కిస్తున్నారు. మహా మూవీస్, M3 మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.   


‘విరాజి’ సినిమాలో వరుణ్ హిట్ కొట్టేనా?


రీసెంట్ గా విడుదలైన ‘విరాజి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. వరుణ్ సందేశ్ కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలువబోతోంది.  ఈ సినిమా వరుణ్ సందేశ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారబోతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ కు వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. వరుణ్ కూడా ఈ సినిమా పైనే తన ఆశలు పెట్టుకున్నారు. ‘విరాజి’ మూవీతో పాటు ‘రాచరికం’ అనే సినిమాలోనూ నటిస్తున్నరు వరుణ్. ఈ సినిమాలో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  


Read Also: వామ్మో.. ఈ బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ అన్నేసి కోట్లా? నీళ్లు దగ్గరపెట్టుకోండి.. కళ్లు తిరుగుతాయ్!



Also Read: నువ్వే జహీర్‌కు ఉత్తమైన భార్యవి - అత్తమామ మాటలకు ఎమోషనలైన సోనాక్షి సిన్హా!