టాలీవుడ్ హీరోయిన్ భాను శ్రీ మెహ్రా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భాను శ్రీ గా కంటే అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమా హీరోయిన్ అంటే వెంటనే గుర్తొస్తుంది. ‘వరుడు’ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోకపోవడంతో ఆమెకు వెంటనే అవకాశాలు రాలేదు. తర్వాత వచ్చినా అవి ఆమెకు గుర్తింపు తేలేకపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. అయితే ఇటీవలే ట్విట్టర్ వేదికగా భాను శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారని ఆరోపించింది. అంతేకాదు ప్రూఫ్ కోసం స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. అయితే ఏం జరిగిందో తెలీదు మళ్లీ కొంత సేపటికి అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశారు అంటూ మళ్లీ ఓ ట్వీట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో బన్ని అభిమానులు రకరకాలుగా స్పందించారు. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో ట్వీట్ తో ముందుకొచ్చింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ అవుతోంది. 


మిమ్మల్ని నొప్పించాలని చేయలేదు : భాను శ్రీ మెహ్రా


ఆమె తాజాగా చేసిన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది.. ‘‘ఈ రోజంతా ఊహించని విధంగా గడిచింది. నేను నిజంగా అల్లు అర్జున్ అభిమానులను నొప్పించాలని అలా చేయలేదు. నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే. నేను నా కెరీర్ కు సంబంధించిన కష్టాలను సరదాగా చెప్పాను. ద్వేషాన్ని కాకుండా నవ్వును, ప్రేమను పంచుదాం.’’ అని పేర్కొంది. దానితో పాటు గ్లాసులో ఏదో తాగుతూ (మందు కొడుతూ ట్వీట్ చేసిందని బన్నీ అభిమానుల ఆరోపణ) వీడియోను కూడా షేర్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భలే దొంగ దెబ్బ తీశావ్’’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. కొంత మంది ‘‘నీ ఛానల్ కు ఎంత మంది ఫాలోవర్స్ పెరిగారు’’ అని అడుగుతున్నారు. ఇంకొంత మంది వెరైటీగా ‘‘ఏం డ్రింక్ తాగుతున్నావ్’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే.. 


‘వరుడు’ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా భాను శ్రీ మెహ్రాకు సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. దీంతో పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఉద్యోగంలో బిజీ అయిపోయింది. అయితే ఇటీవలే భాను ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అందులో వీడియోలు పోస్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ లింక్స్ ను అల్లు అర్జున్, ఇతర హీరోలకు ట్యాగ్ చేయడం చేస్తుంది. ప్రతీసారి యూట్యూబ్ లింక్ లను ట్యాగ్ చేయడంతో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేశారని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే తర్వాత అల్లు అర్జున్ అన్ బ్లాక్ చేయడంతో ఆ విషయాన్ని ట్వీట్ చేసి చెప్పింది భాను. తనను అన్ బ్లాక్ చేసినందుకు బన్నీ కు థ్యాంక్స్ చెప్పింది. అయితే భాను శ్రీ ముందు బన్నీపై ఆరోపణలు చేయడంతో భానునీ టార్గెట్ చేశారు బన్నీ ఫ్యాన్స్. దీంతో దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేసింది. మరి ఇప్పటితో ఈ వివాదం సద్దుమనుగుతుందో లేదో చూడాలి. 


Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?