'కొండపొలం'.. 

 

వైష్ణవ్ తేజ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరించింది. 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!


 

'ఆరడుగుల బుల్లెట్'.. 

 

గోపీచంద్, నయనతార జంటగా తెరకెక్కిన ఈ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి ఐదారేళ్లు అవుతున్నా.. కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8న సినిమాను విడుదల చేయనున్నారు. ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. 





 

'నేను లేని నా ప్రేమకథ'.. 

 

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నేను లేని నా ప్రేమకథ'. సురేష్ ఉత్తరాది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గాయత్రి, అదితి మైకేల్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 8న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. 


 

'వరుణ్ డాక్టర్'.. 

 

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. అమ్మాయిల కిడ్నాప్ లను అడ్డుకునే డాక్టర్ కథే ఈ సినిమా. 


 

ఓటీటీ రిలీజ్ లు.. 

 

'రాజ రాజ చోర'.. 

 

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 8 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు. 


 

'భ్రమమ్‌'.. 

 

బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకున్న 'అంధాధూన్' సినిమాను తెలుగులో 'మ్యాస్ట్రో'గా రీమేక్ చేశారు. అదే సినిమాను మలయాళంలో 'భ్రమమ్‌' అనే పేరుతో తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమాను రవి.కె.చంద్రన్ డైరెక్ట్ చేశారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 


 

'కోల్డ్ కేస్'.. 

 

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ మలయాళ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి 'ఆహా' వేదికగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు.