Upasana Konidela: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మెగా కోడలి గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఉపాసనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ లు ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ లు ప్రస్తుతం దగ్గరదగ్గర్లోనే నివాసం ఉంటున్నారన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-ఉపాసనలు కూడా ఇటీవలే తమ ఇంటిని తమకు నచ్చినట్టు మార్చుకున్నారు. దీంతో ఏ సందర్బం వచ్చినా రామ్ చరణ్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం సందర్భంగా రామ్ చరణ్ దంపతులు చిరంజీవి ఇంట్లో గడిపినట్టుగా తెలుస్తోంది. తాజాగా మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో చరణ్ దంపతులు సండే స్పెషల్ గా చిరంజీవి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 


ఇంతకీ ఉపాసన షేర్ చేసిన వీడియో ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి దగ్గరుండి వంట చేయిస్తున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరిస్తున్నట్టుగా, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనా దేవీ చెప్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. వీడియో చూస్తుంటే మెగా కోడలు ఉపాసన కోసమే ఆ వేడి వేడి వంటకాన్ని సిద్దం చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు దానికి స్పెషల్ గా ఓ నోట్ ను రాసుకొచ్చింది. ‘ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్, ఇంతకంటే నాకేం కావాలి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసి మెగా అభిమానులు మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు. 


ఇక రామ్ చరణ్ ఉపాసన ఇటీవలే ఫారిన్ టూర్ ను ముగించుకొని వచ్చారు. ఈ టార్ కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. త్వరలోనే రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఉపాసనను ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ. మరోవైపు ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. మరోవైపు మెగా అభిమానులు కూడా వారుసుడి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ ప్రాజెక్టులో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా కియార అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.