బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీలు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని సూర్యఘడ్ కోటలో సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కియారా తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ మూవీలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో టాలీవుడ్‌లో మరే సినిమాలకు సైన్ చేయలేదు. 


కియారా బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ జంట మంగళవారం అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. ఏడడుగులతో భార్యభర్తలయ్యారు. సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను హాజరైనట్లు తెలిసింది. కియారా తన పెళ్లికి రాంచరణ్, ఉపాసనను కూడా ఆహ్వానించారు. కానీ అనివార్య కారణాల వల్ల వారు వివాహానికి హాజరుకాలేపోయారు. ఈ సందర్భంగా ఉపాసన కియారా అద్వానీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. పెళ్లికి హాజరుకాలేనందుకు క్షమాపణలు చెప్పింది. రామ్ చరణ్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న RC-15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ చరణ్‌కు జంటగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. అయితే కియారా పెళ్లి కారణంగా ఈ సినిమాలోని ఒక పాట వాయిదా పడిందని సమాచారం. మరి పెళ్లి తర్వాత హీరోయిన్ లకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇవి అందరి విషయంలో ఉండవు అని తెలిసిందే. మరి ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించనుంది? అసలు నటిస్తుందా లేదా అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొంది. త్వరలో ఈ జంట రూ. 70 కోట్ల విలువైన కొత్త జుహు మాన్షన్ కి మారనున్నారు.


Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్