కోలీవుడ్ కి చెందిన రెజీనా కసాండ్రా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ రెజీనా ఐటెం సాంగ్ బాగానే వర్కవుట్ అయింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'అన్యాస్ ట్యుటోరియల్' అనే వెబ్ సిరీస్ లో ఆహాలో విడుదలైంది. 


ఈ హారర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను చర్చించుకున్నారు. అలీ అడిగే విషయాలకు సమాధానాలు చెప్పుకొచ్చింది రెజీనా.. సెకండ్ ఇయర్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లానని.. ఆ సమయంలో తన తల్లి బాగా తిట్టిందని చెప్పుకొచ్చింది రెజీనా. 


అలానే తను ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపించడంతో బయటకు వెళ్లగా.. అప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేశారని.. ఒక షాప్ ఉండడంతో అక్కడికి వెళ్లి అడగ్గా.. క్లోజింగ్ టైమ్ అని చెప్పడంతో వారితో.. 'నేను ప్రెగ్నెంట్.. ఆ స్వీట్ తినాలనుంది' అని అబద్ధం చెప్పిన విషయాన్ని అలీ షోలో వెల్లడించింది రెజీనా. 


'2019 కులుమనాలి.. రూమ్ నెంబర్ నాకు తెలియదు.. ఒకటి జరిగింది' అని రెజీనా ప్రశ్నించగా.. 'నా లైఫ్ లో ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నా.. నా ఫ్రెండ్స్ తో కలిసి కులు మనాలికి వెళ్లాను. మధ్యాహ్నం సమయంలో కళ్లకు ఐమాస్క్ వేసుకొని పడుకున్నా.. అప్పుడు ఎవరో నా నుదుటి మీద వేళ్లతో తడిమినట్లు అనిపించింది. ఎవరా..? అని మెల్లగా కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ ఇన్సిడెంట్ ఎంతో ఫన్నీగా అనిపించింది' అంటూ చెప్పుకొచ్చింది.