Two New Sereials Started in ETV Today: ఈటీవీ త‌న ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌రికొత్త సీరియ‌ల్స్ తో సిద్ధ‌మైంది. రెండు సీరియ‌ల్స్ ఒకేరోజు రెండు సీరియ‌ల్స్ టెలికాస్ట్ అయ్యాయి. అవే 'వ‌సంత కోకిల‌', 'కాంతార‌. ఈ రెండు సీరియ‌ల్స్ ఒక దాని త‌ర్వాత ఒక‌టి ప్ర‌సారం కానున్నాయి. వ‌సంత కోకిల మ‌ధ్యాహ్నం 1.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు కాగా.. ఆ త‌ర్వాత వెంట‌నే 2 గంట‌ల నుంచి 2.30 నిమిషాల వ‌ర‌కు కాంతార ప్ర‌సారం కానుంది. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ఈ సీరియ‌ల్స్ ని ఈటీవీలో చూడొచ్చు ప్రేక్ష‌కులు. జులై 2 నుంచి ఈ సిరియ‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి.

  
 
విధి ఆడిన వింత నాట‌కంలో.. 


'వ‌సంత కోకిల' సీరియ‌ల్ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సీరియ‌ల్ చూడాల‌నే ఇంట్రెస్ట్ క‌లిగిస్తుంది. దాని స్టోరీ లైన్ విష‌యానికొస్తే.. సంధ్యకి అందం, తెలివితేట‌లు అన్ని ఇచ్చాడు దేవుడు. కానీ సౌభాగ్యాన్ని దూరం చేస్తాడు. ఎన్నో ఆశ‌ల‌తో మంచి జీవితం ఊహించుకుని సూర్యాన్ని పెళ్లి చేసుకుంటుంది సంధ్య. అయితే, విధి కార‌ణంగా పెళ్లి జ‌రిగిన కొద్ది రోజుల‌కే సూర్యం క‌న్నుమూస్తాడు. భ‌ర్త‌కు ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి సూర్య త‌ల్లిదండ్రులు మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌ను త‌న సొంత అమ్మ‌నాన్న‌లుగా ప్రేమ‌గా చూసుకుంటుంది సంధ్య. కోడ‌లిని త‌మ కూతురిగానే భావిస్తుంటారు మాధ‌వ‌రావు, ల‌క్ష్మి. ఆమెకు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.


సంధ్య మాత్రం రెండో పెళ్లికి అంగీక‌రించ‌దు. త‌న మ‌న‌సులో సూర్యానికి త‌ప్ప మ‌రొక‌రికి చోటు లేద‌ని అంటుంది. అలాంటి సంధ్య జీవితంలోకి అనుకోకుండా ఆకాశ్ వ‌స్తాడు. సంధ్యను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని ఆశ‌ప‌డ‌తాడు. సంధ్య కోసం మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌తో ఆకాష్ స్నేహంగా ఉండ‌టం మొద‌లుపెడ‌తాడు. ఇక ఈ సీరియ‌ల్ లో సంధ్య పాత్ర‌లో ప‌ద్మ ల‌క్ష, ర‌వి రాథోడ్ ఆకాశ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సూర్యంగా మ‌ధు క‌నిపించ‌బోతున్నాడు. ఈ సీరియ‌ల్‌కు అనిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అరుణ్ కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 


'కాంతార' సీరియ‌ల్‌


జులై 2న ప్రారంభ‌మైన రెండో సీరియ‌ల్ 'కాంతార‌'. గౌర‌వ్‌, అక్ష‌య‌, ప‌వ‌న్ ర‌వీంద్ర త‌దిత‌రులు ఈ సీరియ‌ల్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక క‌థ విష‌యానికొస్తే.. బుట్టాయ గూడేనికి చెందిన 'కాంతార‌', గోపి ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెద్ద‌ల‌ను ఒప్పించిపెళ్లి పీట‌లు ఎక్కాల‌ని ఆశ‌ప‌డ‌తారు. కానీ అనుకోని ప‌రిస్థితుల్లో యువ‌రాజు తో కాంతార పెళ్లి జ‌రుగుతుంది. గోపిని కాద‌ని యువ‌రాజును కాంతార ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ప్రియురాలికి మ‌రో యువ‌కుడితో పెళ్లి జ‌రిగింద‌నే నిజం తెలిసి గోపి ఏం చేశాడు. మ‌న‌సుకు మాంగ‌ల్యానికి మ‌ధ్య కాంతార ఎలా న‌లిగిపోయింది అనేది 'కాంతార' సీరియ‌ల్ క‌థ‌. 'కాంతార' సీరియ‌ల్‌కు శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను నీ కొడుకే అని మిత్రతో చెప్పిన వివేక్.. లక్ష్మీని చూసేసిన జాను!