Trinayani Serial Today Episode తిలోత్తమ, వల్లభలు గజగండ దగ్గరకు వెళ్లి భుజంగ మణి గురించి చెప్తారు. భుజంగమణి గురించి తెలుసుకున్న గజగండ దాన్ని తీసుకొచ్చే శక్తి నయనికి మాత్రమే ఉందని అంటాడు. పంచకమణి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు తీసుకురావొచ్చు కదా అని వల్లభ  గజగండతో అంటే.. పంచకమణిని దొంగిలించిన తనకు ఆ అర్హత లేదని మానసాదేవి ఆలయంలోకి అడుగు పెట్టలేడని గజగండ చెప్తాడు. 


వల్లభ: నయని తప్ప ఇంకెవరు వెళ్లగలరు.
గజగండ: గాయత్రీదేవి.
తిలోత్తమ: ఆమె వెళ్తే మనకు ఒరిగేది ఏమీ లేదు కదా. 
గజగండ: నయని వెళ్లాలి తనకు అవసరం తన కష్టాన్ని మనం వాడుకోవాలి. 
తిలోత్తమ: ఈ సారి నయని ముట్టుకుంటామని చెప్పినా ఇవ్వదు.. ఒకవేళ నయనిని విశాల్ పంపించను అంటే. 
గజగండ: భుజంగమణి దక్కదు. నయని వెళ్లాలి అంటే విశాల్‌ని ఇంకా ఇబ్బంది పెట్టాలి. 
వల్లభ: దాంతో నయని మణికాంత ప్రాంతానికి వెళ్లడం తథ్యం.  


తిలోత్తమ అందరినీ హాల్‌లోకి రమ్మని చెప్తుంది. ఇవాళ ఇంటికి ముఖ్యమైన అతిథి వస్తారని చెప్తుంది. అతిథి ఎవరు అని నయని అడిగితే విశాల్‌ కోసమే వస్తున్నారని తిలోత్తమ చెప్తుంది. ఎవరు అని నయని అడిగితే పంచకమణి గ్రహీత గజగండ వస్తున్నాడని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. గజగండ ఇంటికి వస్తాడు.


తిలోత్తమ: గజగండని రప్పించింది నేనే నయని. 
నయని: ఎందుకు అత్తయ్య.
వల్లభ: డీల్ కుదుర్చుకుందామని.
విశాల్: దేనికి.
గజగండ: పంచకమణి కోసం. గాయత్రీ గజగండ దగ్గరకు వెళ్తే నయని వద్దని అంటుంది. పాపని రానివ్వమని గజగండ చెప్తాడు. పాప పంచకమణి తీసుకొని తన తల్లికి ఇచ్చేస్తుందని వల్లభ అంటే ఇవ్వాలనే గజగండ వచ్చారని తిలోత్తమ అంటుంది. 
నయని: ఇవ్వు.
గజగండ: ఇది ఇస్తాను కానీ నువ్వు భుజంగ మణిని నాకు తీసుకొని వచ్చి ఇస్తే.
విశాల్: భుజంగమణి ఎక్కడుంది దాన్ని తీసుకురావాలి పంచకమణితో నాకు నయం అయితే మళ్లీ దాన్ని మానసాదేవి ఆలయంలో పెట్టేస్తుంది.


గాయత్రీ పాప వెళ్లిపోతుంటే నయని చూసి గజగండ పంచకమణి ఇవ్వడని పాపకి కూడా తెలిసిపోయింది అందుకే వెళ్లిపోతుందని అంటుంది. దానికి గజగండ భుజంగమణి తీసుకొచ్చి ఇస్తే ఇప్పుడే పంచకమణి ఇచ్చేస్తా అంటాడు. నయని ఇవ్వనని చెప్తుంది. ఇక విశాల్ దానికి నయని భుజంగమణి తీసుకొస్తుంది. నీ దగ్గరున్న పంచకమణిని కూడా తీసుకొని మానసాదేవి ఆలయంలో పెడుతుందని చెప్తాడు. ఇంతలో తిలోత్తమ గాయత్రీ దేవి వస్తుందని అంటుంది. గజగండ పని అయిపోతుందా అని విశాల్ అంటాడు. గాయత్రీ దేవి వచ్చి గజగండ ఎదురుగా నిల్చొంటుంది. 


గజగండ: గాయత్రీదేవి..
 గాయత్రీదేవి: నేను ఇచ్చే జీతంతో నీ భార్య పిల్లలు బతికేవారు. మేడం అని అతివినయంగా పిలిచే నువ్వు నన్న గాయత్రీదేవి అని పేరు పెట్టి పిలిచే అంత పెద్ద వాడివి అయిపోయావా గజగండ. 
తిలోత్తమ: గజగండ ఇప్పుడు మహా మాంత్రికుడు అయ్యాడక్క.
గాయత్రీదేవి: షట్ అప్.. షట్‌ అప్.. వీళ్లిద్దరూ చేతులు కలిపి నా కొడుకు చేయి పడిపోయేలా చేశారు నయని. పంచకమణితో మంచి చేయాలి కానీ చెడు చేయాలి అని చూసే వీడిని వదిలిపెట్టకు నయని.
గజగండ: నన్నేం చేయగలరు. నయని ఒక అబల నువ్వు ఒక ఆత్మ. అని పెద్దగా నవ్వుతాడు. 


దాంతో నయని, గాయత్రీ దేవి ఇద్దరూ కలిసి గజగండ పీక పట్టుకుంటారు. అందరికీ నయని మాత్రమే కనిపిస్తుంది. వాడిని చంపేస్తాను అని శవాన్ని తిలోత్తమ తీసుకెళ్తుందని అంటుంది. ఇక గజగండ పంచకమణి పట్టుకొని పారిపోవడానికి మంత్రం చెప్తే అది పని చేయదని అమావాస్య వరకు పనిచేయదని గాయత్రీ దేవి చెప్తుంది. ఇంతలో గజగండ పంచకమణి తిప్పి మాయం అయిపోతాడు. శుక్రవారం వచ్చి మణికాంత ప్రాంతానికి వెళ్లే మార్గం చెప్తా విశాల్‌కి ధైర్యంగా ఉండమని చెప్పు అని గాయత్రీ దేవి వెళ్లిపోతుంది. నయని విశాల్‌కి విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: మామ కోడళ్ల మాటల యుద్ధం.. క్రిష్‌ మాటలకు భయపడుతున్న సత్య, రుద్ర ఎందుకు టెన్షన్ పడుతున్నాడో!