Brahmamudi Serial Today Episode:  కళ్యాణ్‌  రోడ్డున పడటం కాదు. నిన్ను ఇది రోడ్డున పడేయకుండా చూసుకో అంటుంది అప్పు.  దీంతో ఆలోచనలో పడిపోతాడు సామంత్‌. అదంతా ఏం లేదు మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంది అనామిక. నిజమేనా బ్రో అని సామంత్‌ ను అడుగుతుంది. అవునని సామంత్‌ చెప్తాడు. అయితే నీకు ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్స్‌ ఉంటే వెంటనే వాళ్లతో ఫ్రెండిప్‌ కట్‌ లేదంటే నీకు వాళ్లకు అక్రమసంబంధం అంటగట్టి నిన్ను కోర్టుకు ఈడుస్తుంది. అని చెప్పి వెళ్లిపోతారు మరోవైపు రాజ్‌ కిందకు వస్తూ కావ్య వంట చేయకపోతే ఎవ్వరూ చేయరన్నంత బిల్డప్‌ ఇస్తున్నారు. ఈరోజు నుంచి శాంతతో వంట చేయిస్తాను.


రాజ్‌: శాంత


శాంత: ఏంటి బాబు మీకు కాఫీ ఇవ్వమంటారా?


రాజ్‌: ఇందాకే ఇచ్చావు కదా? ఈరోజు నుంచి నేను నీకు ప్రమోషన్‌ ఇస్తున్నాను.


ఇందిరాదేవి: ఎందుకు శాంతకు ప్రమోషన్‌ ప్రకటించారో తెలుసుకోవచ్చా రాజుగారు.


రాజ్‌: తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈరోజు నుంచి ఇంట్లో శాంతనే వంట చేస్తుంది. ( అందరూ షాక్‌ అవుతారు) ఏంటి ఇంత చిన్న విషయానికి అంత స్టాండ్‌ అవసరమా?


రుద్రాణి: ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నావు రాజ్‌.  


రాజ్: ఈ ఇంట్లో ఎవ్వరో లేకపోతే ఏదో లోటు జరుగుతుందనుకున్న వాళ్లకు శాంత వంటే సమాధానం.


ప్రకాష్‌: అది సమాధానం కాదు నాన్నా ఆరోగ్య దానం.


రాజ్‌: బాబాయ్‌ నీకు శాంత వంట గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు.


ధాన్యలక్ష్మీ: శాంత వంట నువ్వు ఎప్పుడు తిన్నావు రాజ్‌.


అపర్ణ: తిన్నాడులే ఒకరోజు


ఇందిరాదేవి: అసలు ఎందుకురా నీకు అంత పంతం.


స్వప్న: నాకేం అభ్యంతరం లేదు. కానీ శాంత వంట చేయగానే ముందుగా మా అత్తకు పెట్టాలి. ఆవిడ బాగుంటే మనమందరం సేఫ్‌


రుద్రాణి: ఏయ్‌ షటప్‌.. మీరంతా సైంటిస్టులు.. నేను ఎలుకనా..?


రాజ్‌: మీరంతా ఎందుకు టెన్షన్‌ పడతారు అత్తయ్యా ముందు నేనే తింటాను


   అంటూ శాంతను శాంత వంటను మెచ్చుకుంటాడు. శాంతను వెళ్లి వంట చేయమని అపర్ణ చెప్తుంది. సరేనని వంటలు కుమ్మేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది శాంత. మరోవైపు బొమ్మలు చేస్తున్న  కృష్ణమూర్తి దగ్గరకు వచ్చి సాయం చేస్తానంటుంది కావ్య. లోపలి నుంచి వచ్చిన కనకం కోపంగా కావ్యను, కృష్ణమూర్తిని తిడుతుంది. కాపురానికి వెళ్లాల్సిన కూతురుని బొమ్మలు చేయిస్తున్నావని అంటుంది. తర్వాత కనకం అల్లుడి గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్తుంది. అపర్ణను గుర్తు చేసుకుని కావ్య బాధపడుతుంది. మరోవైపు శాంత చేసిన వంట తినేందుకు అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రెడీగా ఉంటారు.


రాజ్:  అబ్బాబ్బా వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి.


ప్రకాష్‌: ఆ వీధి చివర ఇంజనీరు నా కారు పోకుండా బైక్‌ అడ్డంగా పెట్టాడురా. వాణ్ని కూడా పిలవరా భోజనానికి.


ధాన్యలక్ష్మీ: చాల్లేండి మీరు మరీ చెప్తున్నారు.


ఇందిరాదేవి: పాపం దానికి చేతనైంది అది చేసిందిరా తినక ముందే ఇన్ని రకాలుగా అంటే ఎలా?


రాజ్‌: శాంత నీ వంట సంగతి తెలియని వాళ్లు ఏదేదో అంటుంటారు. ముందు నువ్వు వడ్డించు అందరికీ..


 ప్రకాష్‌: మా వదిన పాపం హాస్పిటల్‌ నుంచి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. కావాలంటే మా ధాన్యలక్ష్మీకి వడ్డించు.


   అని ఒక్కొక్కరు తమకు వద్దంటే తమకు వద్దని అటుంటారు. ఇంతలో అపర్ణ ఇక చాలు ముందు నిన్ను వంట చేయమన్నది ఎవరో వాళ్లకు వడ్డించు అని చెప్పగానే రాజ్‌ కు వడ్డిస్తుంది శాంత. ఆ భోజనం తిన్న రాజ్‌ ప్రీజ్‌ అయిపోతాడు. కారం తట్టుకోలేక అల్లాడిపోతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఆరోజు అంత అద్బుతంగా వంట చేశావు ఈరోజు ఏంటి ఇలా చేశావు అని రాజ్‌ అడుగుతాడు. దీంతో అపర్ణ ఆరోజు వంట చేసింది కావ్య అని చెప్తుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని కావ్య తీసుకురా అని చెప్తుంది అపర్ణ. లేదంటే నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసుగా? అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రాజ్‌ లేచి వెళ్లిపోతాడు.  



   మరోవైపు అనామికను తీసుకుని సామంత్‌ ఆఫీసుకు తీసుకెళ్తాడు. ఆఫీసులో వాళ్లు ఇద్దరి గురించి బాడ్‌ గా మాట్లాడుకుంటారు. మన కంపెనీ స్వరాజ్‌ ను మించి పోవాలంటే కావ్య మనకు డిజైన్స్‌ ఇవ్వాలని అందుకోసం ఒకణ్ని రంగంలోకి దించుతానని చెప్తుంది అనామిక. మేనేజర్‌ పిలిచి సందీప్‌ ద్వారా కావ్య మనకు డిజైన్స్‌ ఇచ్చేలా చేయాలని చెప్తుంది. మేనేజర్‌ సరే అని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను బ్లాక్‌ మెయిల్‌ చేసిన భూమి -  ఇందును తిట్టిన చెర్రి