Trinayani Today March 26th Episode

  సుమన గాయత్రీ పాపని చాటుగా తీసుకొని బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పెద్దబొట్టమ్మను డమ్మక్కను చూసిన సుమన వాళ్లవైపు చూడకుండా పరుగులు తీస్తుంది. సుమన గాయత్రీ పాపను తీసుకొని బయటకు వెళ్లింది అని పెద్దబొట్టమ్మకు డమమ్మక్క చెప్తుంది. దీంతో పెద్దబొట్టమ్మ ఏయ్ సుమన ఆగుని అరుస్తుంది. మరో వైపు పావనామూర్తి వాళ్లు ఇంట్లో అందరూ హాల్‌లోకి రావడంతో సుమన ఉలూచిని తీసుకొని బయటకు వెళ్లింది అనుకొని ఆ విషయం నయని వాళ్లకు చెప్తారు. ఇంతలో విక్రాంత్ ఉలూచిని తీసుకొని రావడంతో అందరూ షాక్ అవుతారు. 


నయని: పాపను ఎత్తుకొని వెళ్లింది అన్నారు కదా..
డమ్మక్క: డమ్మో డమ్మ.. సుమన ఎత్తుకుంది నన్ను నయని. అని గాయత్రీ పాపను తీసుకొని వస్తుంది.
దురంధర: నిన్నా..
డమ్మక్క: అవును నన్ను మోసుకొని వెళ్లగలవా అని పందెం కాసాను. ఇంతలో పెద్దబొట్టమ్మ, సుమన అక్కడికి వస్తారు. సుమన అబద్ధం జరిగింది అని ఏదో జరిగింది అని సుమన ముఖంలో తేడా కనిపిస్తుంది అని పావనా, దురంధరలు అనుకుంటారు.


నయని: పెద్దమ్మ ఏంటి ఇలా వచ్చావ్..
పెద్దబొట్టమ్మ: మునగ గౌరి నోము నోచుకుంటున్నాను నయని. దారిన కనపడిన ముత్తయిదువులకు వాయినం ఇస్తూ వెళ్తుంటే సుమనే పిలిచింది.
విక్రాంత్: నువ్వు పిలిచావా ఆశ్చర్యంగా ఉంది..
సుమన: ఇందులో ఆశ్చర్యం ఏముంది వాయినం ఇస్తూ కనిపిస్తే మన ఇంట్లో కూడా ముత్తయిదువులు ఉన్నారని రమ్మన్నాను.
తిలోత్తమ: ఎప్పడూ ఇంటి చుట్టే తిరిగే పెద్దబొట్టమ్మను మనం పిలవక్కర్లేదు.
నయని: నోము నోచుకొని వచ్చింది కదా ఇలాంటప్పుడు ఇంట్లో అడుగుపెడితే మనకే మంచిది అత్తయ్య. 


పెద్దబొట్టమ్మ వాయినం ఇవ్వడానికి సిద్ధమైతే నలుగురికి ఒకేసారి వాయినం ఇవ్వమని సుమన అంటుంది. అంత భయం ఉన్నదానివి ఎందుకు పెద్దబొట్టమ్మను ఇంటికి పిలిచావు అని అడిగితే డమ్మక్క కలుగజేసుకొని ఒప్పదం అలాంటిది పుత్రా అని చెప్తుంది. సుమన, పెద్దబొట్టమ్మ షాక్ అవుతారు. 


విశాల్: దేని పైన ఒప్పందం చేసుకున్నారు డమ్మక్క.
డమ్మక్క: ఒకర్ని ఒకరు దూషించుకోకుండా వచ్చిన పని చేసుకొని వెళ్లాలనే ఒప్పందం చేసుకున్నారు. 


ఫ్లాష్‌బ్యాక్


పెద్దబొట్టమ్మ సుమనను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగి కొంగు తీసి గాయత్రీ పాపను చూస్తుంది. మన బిడ్డను కాకుండా నయని బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. తాను గాయత్రీని ఎత్తుకొని వెళ్తే తాను ఉలూచిని ఎత్తుకొని పోతానని పెద్దబొట్టమ్మ సుమనను బెదిరిస్తుంది. దీంతో సుమన కిడ్నాప్ డ్రామాను పక్కన పెడుతుంది.


ప్రస్తుతం


పెద్దబొట్టమ్మ అందరికీ వాయినం ఇస్తుంది. తర్వాత పెద్దబొట్టమ్మ ఉలూచి, గాయత్రీ పాపలను కూర్చొపెట్టి ఖాళీ అయిప గంపతో దిష్టి తీస్తాను అంటుంది. సుమన కంగారు పడుతుంది.


పెద్దబొట్టమ్మ: ఈ బుట్టను కప్పి ఉలూచిని మాయం చేసి నేను కూడా పాముగా మారి వెళ్లిపోతే సుమన ఏం చేస్తుంది. 
సుమన: ఇది ఏదో చేయబోతుంది. ఉలూచిని ఎలా అయినా కపాడుకోవాలి. త్వరగా దిష్టి తీయు పెద్దమ్మ. 
 
పెద్దబొట్టమ్మ దిష్టి తీసి ఉలూచిని మాయం చేయాలి అనుకుంటే గాయత్రీ పాప మాయం అయిపోతుంది. అందరూ షాకై పోతారు. పాప ఏది అని తెగ కంగారు పడతారు. పెద్దబొట్టమ్మను అందరూ అడుగుతారు. తాను గాయత్రీని మాయం చేయలేదు అని చెప్తుంది. అందరూ గాయత్రీ పాపను వెతికే పనిలో పడతారు. ఇక గాయత్రీ పాప కనిపించడం లేదు అని తను కనిపించకపోవడంతో హ్యాపీగా ఫీలవుతారు తిలోత్తమ, వల్లభ. 


తిలోత్తమ: కోట్లకు అధినేత్రి అయినందుకు దిష్టి తగిలి ఇలా అయిందో లేదంటే గుడ్డిగా విష సర్పాన్ని నమ్మి పెద్దబొట్టమ్మను ఇంట్లోకి రానిచ్చినందుకు ఇలా అయిందో అదంతా మనకు అనవసరం. కానీ విశాల్, నయనిల ముందు అయ్యో పాపం అన్నట్లే మనం ఉండాలి. గాయత్రీ ఇక కనిపించకుండా పోతే ఆస్తి పత్రాలను క్యాష్‌ చేసుకోవాలి. పాప దొరికితే మాయం చేయడానికి కారణం అయిన వాళ్లను ఇరికించేసి మంట పెట్టి మనం కూల్‌గా ఉండాలి. 


విశాల్, నయని, హాసినీలు పాప కనిపించడం లేదని కంగారు పడతారు. విశాల్‌ హాసినితో పాప తన తల్లి కాబట్టి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వస్తుందనే ధైర్యంతో ఉన్నానని అంటాడు.  ఇక నయని తెగ కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: గాయత్రీ సింహాద్రి: ‘కార్తీక దీపం 2'లో లేడీ విలన్ ఈమే - భయంగా ఉందన్న నిరూపమ్, ధైర్యం చెప్పిన ప్రేమి