Trinayani Serial Today Episode గాయత్రీదేవి పునర్జన్మలో ఎక్కడుందో తెలీదని అందుకే ఈ పుట్టిన రోజు నుంచి గాయత్రీ పాపనే గాయత్రీ దేవిగా చూస్తానని నయని అంటుంది. దానికి విశాల్, హాసిని సంతోషపడతారు. ఇక తిలోత్తమ, సుమన, వల్లభలు అడ్డుకుంటారు. 


నయని: ఈ జన్మలో గాయత్రీ దేవి పసి బిడ్డగా రారు. మరో జన్మ ఉండదు. కొడుకు పరిస్థితి చూసి ఆత్మగా వచ్చి కుమిలిపోయారు. ఇంకెప్పుడు నా తొలి బిడ్డ రాలేదని అడగను ఆ ప్రస్తావన తీసుకురాను.
వల్లభ: పాపం..
విశాల్: ముందు కేక్ కట్ చేయండి ఇన్ని ఏర్పాట్లు చేయించిన తర్వాత కేక్ కట్ చేయకపోతే బాగోదు.
సుమన: మీరు ఇంకా వాళ్ల పిల్లనే ఎత్తుకుంటారా ఇచ్చేయండి.


గానవి, గాయత్రీ, పండరీనాథాలతో రెండు జంటలు కేక్ కట్ చేయిస్తారు. విశాల్ చేయి నొప్పితో చాలా ఇబ్బంది పడతాడు. గానవి చేయి పట్టుకొని కట్ చేయించాలని సుమన, తిలోత్తమ విశాల్ చేతిపై సెటైర్లు వేస్తారు. హేళన చేస్తారు. విశాల్ పరిస్థితికి నయని ఏడుస్తుంది. విక్రాంత్ తిడతాడు. విశాల్‌ని తినిపించమని అంటాడు కానీ ఎంత ప్రయత్నించినా చేయి రాదు. దాంతో నయని విశాల్‌లు ఏడుస్తారు. ఇక ఎడమ చేతితో తినిపించడానికి విశాల్ అంగీకరించడు. ఇంతలో గాయత్రీ పాప తండ్రి కుడి చేయి పట్టుకొని పైకి లేపుతుంది. కేకు తీసుకొనేలా చేయి కేకు దగ్గర పెట్టి కేక్ తీసి గానవికి తర్వాత తనకి తినిపించేలా చేస్తుంది. పాప చేసిన పనికి నయని వాళ్లు సంతోషిస్తారు. తిలోత్తమ వాళ్లు రగిలిపోతారు. విశాల్ పాపకి థ్యాంక్స్ చెప్తాడు. 


రాత్రి ఎదురుగా వాటర్ గ్లాస్ పెట్టుకొని విశాల్ కుడి చేతితో తీసుకోవాలని అంటాడు. నయని, హాసిని వస్తే విశాల్ పక్షవాతం వచ్చిన చేతిని లేపుతున్నానని అంటే అది పక్షవాతం కాదు అని హాసిని వాళ్లు ధైర్యం చెప్తారు. చేతికి చలనం లేదు నొప్పి ఉందని చెప్తుంటే డాక్టర్లు కూడా ప్రాబ్లమ్ కూడా తెలీడం లేదని అంటాడు. దాంతో నయని మణికాంత దీవికి వెళ్లాలని అంటుంది. నయనిని వెళ్లొద్దని విశాల్ అంటాడు. హాసిని కూడా ఏం కాదు వెళ్లమని అంటుంది.



నయని: చూడండి బాబుగారు పౌర్ణమి గడియల కోసం ఎదురు చూస్తున్నాను. గాయత్రీ అమ్మగారు దాచిన పేపర్లు దాచాను వాటి ద్వారా పౌర్ణమి గడియల్లో అక్కడికి చేరుకొని మీ చేతిని తగ్గించుకునేందుకు పచ్చిక మణిని కచ్చితంగా తీసుకొస్తాను.
విశాల్: మనసులో మీకు ఎలా చెప్పాలి అక్కడ ఎలా ఉంటుందో మా అమ్మ చిన్నప్పుడు కథల్లా చెప్పింది అది జరిగిన కథ ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో తెలీదు.


సుమన హాల్‌లో ఉంటే గాయత్రీ పాప సుమన దగ్గరకు వస్తే సుమన పాపని తిడుతుంది, ఇంతలో పెద్ద బొట్టమ్మ అక్కడికి వచ్చి గాయత్రీ దేవి చదివిన పేపర్ల ఆధారంగా మనిద్దరం మానసాదేవి దగ్గరకు వెళ్దామని అంటుంది. సుమన షాక్ అయిపోతుంది. మన వల్ల అవుతుందా అని అంటుంది. దానికి పెద్దబొట్టమ్మ పంచకమణితో కోటీశ్వరులు అవ్వొచ్చని అంటే వెళ్దామని పెద్దబొట్టమ్మ అంటుంది. ఇక నయని పేపర్లు తెరిస్తే అవి పట్టుకొని పారిపోదామని పెద్దబొట్టమ్మ అంటుంది. ఇక అందరూ హాల్ లోకి వస్తారు. విశాల్ని చూడటానికి వచ్చానని పెద్దబొట్టమ్మ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: ఆ విషయంలో 'గుప్పెడంత మనసు' జగతి మేడం తర్వాత 'బ్రహ్మముడి' రుద్రాణి అత్తే!