Rangula Ratnam June 19th: రఘు ఇంటికి రాగానే సీత అత్త మామయ్య కలిసిపోయారా అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న పూర్ణని చూసి ఆశ్చర్య పోతుంది. ఇక డాక్టరమ్మ, పూర్ణ జరిగిన విషయం చెప్పటంతో సీత బాధపడుతుంది. ఆ తర్వాత పూర్ణ డాక్టరమ్మ కాళ్ల మీద నావల్ల మీరు మాటలు పడ్డారు అని.. జరిగిన విషయాలు చెప్పుకొని బాధపడుతుంది.


నా వల్లే మీకు ఇదంతా జరిగింది కదా అంటూ క్షమించమని వేడుకుంటుంది. దాంతో డాక్టరమ్మ బాధపడొద్దని ధైర్యం ఇస్తుంది. నీకు ఏ సహాయం కావాలంటే నేను ఉన్నాను అంటూ మాట ఇస్తుంది. దాంతో రఘు కూడా డాక్టరమ్మ మంచితనాన్ని మెచ్చుకుంటాడు. నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అని చెబుతాడు.


ఆ తర్వాత డాక్టరమ్మ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు.. మూర్తి మీటింగ్ హాల్ దగ్గరికి రావటంతో.. అందులో ఉన్న పార్ట్నర్స్ శంకర్ ప్రసాద్ ఎక్కడ అని అడుగుతారు. ఇవాళ ఆయన రాలేరు అని మూర్తి అనడంతో అదే సమయంలో అక్కడికి రేఖ వచ్చి మీటింగ్ తను చేయడానికి వచ్చాను అనటంతో అందరూ ఆమె ఆ కుర్చీలో కూర్చోవడానికి నిరాకరిస్తారు.


అంతేకాకుండా నువ్వేంటో.. నీ బతికేంటో అందరికీ తెలుసు అంటూ అవమానిస్తారు. దాంతో రేఖ కోపంతో రగిలిపోతుంది. ఇక శంకర్ ప్రసాద్ కి తమ నిర్ణయం చెప్పమని మూర్తితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్లి రేఖ ఫైర్ అవుతుండగా స్వప్న ఏం జరిగిందని అడుగుతుంది. దాంతో రేఖ శంకర్ ప్రసాద్ రావడానికి గమనించి ఏడుపు ముఖం పెట్టి అందరూ తన పరువు తీస్తున్నారు అనటంతో.. నువ్వే అందరి పరువు తీస్తావు అని స్వప్న అంటుంది.


ఇక ఆ మాటలు విన్న శంకర్ ప్రసాద్ స్వప్న పై అరుస్తాడు. తనను ఎందుకలా అంటున్నావు అని అంటాడు. దాంతో స్వప్న రేఖ నటించిందని తెలుసుకుంటుంది. ఇక స్వప్న సారీ చెప్పటంతో శంకర్ ప్రసాద్ క్లాస్ పీకి తనను లోపలికి పంపిస్తాడు. ఇక ఏం జరిగింది అని భార్యను అడగటంతో.. జరిగిన విషయం మొత్తం చెబుతుంది. ఆ మాటలు అన్ని స్వప్న వింటుంది.


మీ పార్ట్నర్స్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు అని చెబుతుంది. ఇక స్వప్న మంచి పని అయిందని.. ఇప్పుడు చైర్మన్ గా సిద్దుకి ఇస్తాడు అని అనుకుంటుంది. కానీ శంకర్ ప్రసాద్ ఆ భాధ్యతలన్నీ రేఖకు ఇస్తాడు. కాసేపు తన ఏడుపు ముఖంతో శంకర్ ప్రసాద్ ను బోల్తా కొట్టిస్తుంది. ఇక శంకర్ ప్రసాద్ లోపలికి వెళ్లి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు.


ఖాళీ బాండ్స్ పేపర్ మీద సంతకం పెట్టాను.. పవర్ ఆఫ్ ఎటార్నియా తీసుకో.. ఇక ఎవరు నీ గౌరవం ను భంగం కలిగించరు అనటంతో.. స్వప్న అదంతా చూసి షాక్ అవుతుంది. ఇక దీనికి ఈ హక్కు కలిగితే పురుగుల కంటే హీనంగా చూస్తుంది అని అనుకుంటుంది స్వప్న. కానీ రేఖ మాత్రం లోపల కావాలనుకుంటూనే బయట వద్దు అన్నట్లుగా నటిస్తుంది.


కానీ శంకర్ కొన్ని రోజుల పాటు ఈ బాధ్యతలు తీసుకో తర్వాత నేనే తిరిగి తీసుకుంటాను అని రిక్వెస్ట్ చేయటంతో రేఖ తీసుకుంటుంది. వెంటనే స్వప్న రేఖను ఫాలో అవుతుంది. ఇక రేఖ తన గదిలోకి వెళ్లి తనను ఆపేవాళ్లు ఎవరు లేరు అని తెగ సంతోషపడుతుంది. ఇక అదంతా చూసి సప్న సిద్దు కి చెప్పాలనుకుంటుంది. మరోవైపు జానకి దిగులుగా ఉండగా తన భర్త వచ్చి అన్నం వడ్డించమని అనడంతో.. ఏదో ఆలోచనలో ఉండి ఎక్కువగా వడ్డించేస్తుంది.


దాంతో తన భర్త ఏం జరిగింది అని అడగటంతో.. పూర్ణ గురించి చెబుతూ బాధపడుతుంది. ఏం జరిగింది అని ఆయన అడగడంతో.. జరిగిన విషయం చెబుతుంది. దాంతో ఆయన శంకర్ తప్పు కాదని రేఖ తప్పు అని అంటాడు. ఇక తరువాయి భాగంలో సప్న సిద్దుకి జరిగిన విషయం చెప్పటంతో సిద్దు షాక్ అవుతాడు. ఆ తర్వాత కోపంగా రేఖ దగ్గరికి వెళ్తాడు.


Read also: Trinayani June 19th: నగలు చూసి చూపు పోగొట్టుకున్న సుమన- తల్లి, కొడుకుకు షాకిచ్చిన విశాలాక్షి?