Madhuranagarilo June 28th: మధుర వాళ్ళు గుడికి చేరుకోగా అక్కడ రాధ, శ్యామ్ ల జంటను ఆశీర్వదిస్తాడు పూజారి. కానీ సంయుక్త శ్యామ్ కి కాబోయే భార్యను నేను అనడంతో పూజారి పొరపాటు పడ్డాను అని క్షమాపణ చెబుతాడు. పర్వాలేదు అని మధుర అనటంతో అపర్ణ వాళ్లకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత పూజ ముగిసిన తర్వాత పూజారి సంయుక్త, శ్యామ్ జంటలను ఆశీర్వదిస్తాడు.


అదే సమయంలో గుడికొస్తున్న ఒక ఆవిడ తుమ్మటంతో అది అపశఖనం అనుకుంటారు. ఆ తర్వాత పూజారి దేవుడు సమక్షంలో జరిగింది కాబట్టి ఏం కాదు అని అంటాడు. ఇక అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదం తింటుండగా రాధ ఒక చెట్టు వైపు చూసి అక్కడ ముడుపు కడితే ఆడుకున్నది తీరుతుందని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక రాధ వెళ్ళటంతో శ్యామ్ కూడా వెళ్తాడు అని సంయుక్త అనుకోవడంతో వెంటనే శ్యామ్ కూడా ఫోన్ వంకతో వెళ్తాడు.


ఇక సంయుక్త కూడా అక్కడి నుండి వెళ్లి ఫాలో అవుతుంది. ఇక రాధ పండు కి ముడుపు గురించి చెప్పటంతో ఆ మాట విని శ్యామ్, సంయుక్త లు కూడా ముడుపు కట్టాలని అనుకుంటారు. ఇక రాధ ఎలాగైనా పండు వాళ్ళ డాడీ ఆచూకీ దొరకాలి అని రాస్తుంది. శ్యామ్ తనకు రాధకు పెళ్లి జరగాలని రాస్తాడు. సంయుక్త తనకు శ్యామ్ కు పెళ్లి జరగాలని రాస్తుంది.


ఇక సంయుక్త రాధను ఉడుపు కట్టనివ్వకుండా చేయాలి అని తను వచ్చే దారిలో ముల్లులు వేస్తుంది. రాధకు అవి గుచ్చుకోవటంతో గట్టిగా అరుస్తుంది. వెంటనే శ్యామ్ అక్కడికి వస్తాడు. తను నడవలేని పరిస్థితి చూసి ముడుపు కట్టడానికి కోసం తనను ఎత్తుకొని ముడుపు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తనకు ముళ్ళు తీసి.. కావాలనే తన ముడుపును రాధ తో కట్టించాలి అని ఎత్తుకొని కట్టిస్తాడు.


పొరపాటు జరిగింది అని మళ్లీ రాధ ముడుపు ఇచ్చి కట్టిస్తాడు. ఇదంతా చూసి సంయుక్త కోప్పడుతుంది. మూడుసార్లు ఎత్తుకున్నాడని రగిలిపోతుంది. ఆ తర్వాత రాధ అక్కడి నుంచి వెళ్లగా సంయుక్త వచ్చి ముడుపు కట్టడానికి ప్రయత్నిస్తూ ఎత్తుకోమని అంటుంది. కానీ శ్యామ్ అక్కడున్న స్టూల్ తెచ్చుకొని ఎక్కి కట్టుకో అని వెళ్ళిపోవటంతో సంయుక్త కు మరింత కోపం వస్తుంది.


ఆ తర్వాత రాధ అక్కడ ఒక గురువు భూత, వర్తమాన, భవిష్యత్తు చెబుతాడని.. ఆయన ఏది అంటే అది ఖచ్చితంగా అవుతుందని తెలుసుకోగా ఆ గురువు దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం తీసుకుంటుంది. ఇక ఆయన కల్యాణ ప్రాప్తిరస్తు అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళగా శ్యామ్ ఆ మాటలు విని ఆమెకు పెళ్లి ఒక బాబు కూడా ఉన్నాడు కదా అలా ఎలా దీవించారు అని అడుగుతాడు.


ఆమెకు పెళ్లి కాలేదు అని.. ఆమె ఆ బిడ్డను 9 నెలలు కానీ మోయలేదు.. కొన్ని కారణాలవల్ల ఆ బిడ్డకు తల్లి అయింది అని చెప్పటంతో శ్యామ్ ఆశ్చర్యపోతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మధుర దంపతులు మొదటి కార్డు రాధకి ఇవ్వడానికి వెళ్తారు. శ్యామ్ ఇంట్లో రాధ గురించి ఆలోచిస్తూ వెంటనే అమ్మకు నిజం చెప్పేయాలి అని.. కార్డ్స్ అందరికీ పంచలేదు కాబట్టి తన ప్రేమ గురించి చెప్పాలి అని బయలుదేరుతాడు.


ఇక రాధకు కార్డు ఇవ్వడానికి వెళ్లిందని తెలియడంతో వెంటనే రాధ ఇంటికి వెళ్లేసరికి మధుర దంపతులు రాధకు కార్డు ఇస్తారు. తరువాయి భాగంలో పండుకు కింద పడిపోవటంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టరు లివర్ కి సంబంధించిన సమస్య గురించి చెబుతూ దానికి మార్గం చెబుతుండగా వెంటనే రాధ బాబుకు కన్నతల్లిని కాను అని చెబుతుంది. దాంతో ఆ మాట విని సంయుక్త స్టన్ అవుతుంది.


Also Read: Rangula Ratnam June 27th: భర్త కోసం మరోసారి పేరు మార్చుకున్న పూర్ణ.. నిజం తెలియటంతో తట్టుకోలేకపోతున్న సూర్యం?