Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అందరితోపాటు అనుకి కూడా బిక్ష వేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళు ఎవరీవిడ కొత్తగా ఉంది అనుకుంటారు.


ఇంతలో అక్కడికి వాచ్మెన్ వచ్చి మినిస్టర్ గారు వస్తున్నారు మీరు ఈ మెట్లు ఖాళీ చేయండి అని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ తరిమేస్తాడు. అను చేతిలో ఉన్న పళ్ళెం రోడ్డుపై పడటం, అటుగా మాన్సీ వాళ్ళు కారులో రావడం ఒక్కసారే జరుగుతుంది.


మాన్సీ : మా కారు కింద పడి డబ్బులు వసూలు చేద్దామనుకుంటున్నావా అని కోపంగా కారు దిగి అను దగ్గరికి వస్తుంది.


అను: క్షమించండి అని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉన్న అను, మాన్సీ వాళ్ళని చూసి షాక్ అవుతుంది వాళ్ళు కూడా అనుని చూసి అలాగే షాక్ అవుతారు.


మాన్సీ : ఏంటి ఈ అవతారం మళ్లీ కొత్త నాటకమా అంటుంది.


ఛాయాదేవి : తనదికాని కుటుంబాన్ని పోషించడానికి మొగుడికి ఈ విధంగా సాయం చేస్తున్నట్లుంది అని వెటకారంగా మాట్లాడుతుంది.


అను: నా విషయంలో కలగజేసుకోవద్దు అని చెప్పాను కదా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ఛాయదేవి : ఏ కారణం లేకుండా తను ఇలా చేయదు మనం ఆమెని ఫాలో అవుదాం అంటుంది.


మాన్సీ: వద్దు నా మనిషిని ఫాలో అవమని చెప్తాను ఈ లోపు మనం హాస్పిటల్ కి వెళ్లి వద్దాం అని అక్కడినుంచి బయలుదేరుతారు.


మరోవైపు పిల్లలు ఇద్దరిని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు ఆర్య. అక్కడ కనిపించిన జెండేని పలకరిస్తారు పిల్లలు ఇద్దరూ.


పిల్లలు: మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావ్ ఫ్రెండ్ అని అడుగుతారు.


జెండే : మీతో చిన్న పని ఉండి నేనే తీసుకు రమ్మన్నాను అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి తీసుకువెళ్తాడు.


ఇంతలో ఆర్య అను కి ఫోన్ చేసి పిల్లలిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి తీసుకువచ్చాను అని చెప్తాడు.


అను: కంగారుపడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకండీ అంటుంది.


ఆర్య : తండ్రి కోసం ఆ పిల్లలిద్దరూ ఎంత తపన పడుతున్నారో మీరు చూశారు కదా మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను అంటాడు.


అను : ఆ పిల్లల తండ్రి మీరే అని చెప్పలేను అని మనసులో బాధపడుతుంది. బయటకి మాత్రం మీ ఇష్టమే అని చెప్తుంది.


ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసే దగ్గరికి ఆర్య వస్తే భయంతో పిల్లలు ఇద్దరు ఆర్యని హత్తుకుపోతారు. ఇదంతా ఏంటి అని అడుగుతారు.


ఆర్య : ఇదంతా మీ మంచి కోసమే, మీ నాన్నగారు ఎవరో త్వరగా కనిపెట్టవచ్చు అంటాడు.


పిల్లలు: మాకు నాన్నగా ఉండడం నీకు ఇష్టం లేదా మా అమ్మని నువ్వు పెళ్లి చేసుకోవా అని నిలదీస్తారు.


ఆర్య : మీ అమ్మగారు ఈ పెళ్లి మీ కోసమే ఒప్పుకున్నారు. ఆవిడ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అంటాడు.


ఈ రకంగా అయినా మీరే మా నాన్న అని మీకు తెలుస్తుంది అని మనసులో అనుకుంటారు పిల్లలు.


పిల్లలు శాంపిల్స్ ఇవ్వటానికి భయపడుతూ ఉండటంతో డాక్టర్ తో ముందు నా శాంపిల్స్ తీసుకోండి అప్పుడు పిల్లలకు భయం పోతుంది. అప్పుడు పిల్లల శాంపిల్స్ తీసుకోండి అని చెప్పడంతో డాక్టర్ అలాగే చేస్తాడు.


మరోవైపు మిగిలిన బిక్షగాళ్లతో పాటు అను కూడా వేరే గుడి వద్ద ఆడుకుంటూ ఉంటుంది అక్కడ బిచ్చగాళ్ళు నువ్వు చూడటానికి మా లాగా లేవు. నువ్వు వచ్చావు, అక్కడ గుడి దగ్గర తరిమేశారు, ఇప్పుడు నీ వల్ల మాకు పైసలు చిక్కడం లేదు అని చెప్పి అనుని తరిమేస్తారు.


హాస్పిటల్ పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వస్తుంటే దారిలో బెలూన్స్ కొనుమంటుంది అక్కి. అక్కడే అను రోడ్డుపై అడుక్కుంటూ ఉంటుంది. ఆర్య వాళ్ళని చూసి దాక్కుంటుంది కానీ అక్కి మాత్రం తల్లి అని తెలియకుండానే అనుకి బిక్షం వేస్తుంది.


అను : నా తల్లితో భిక్షాటన ప్రారంభించి నా పిల్లల సహకారంతో నా దీక్ష ముందుకు వెళ్లేలాగా చేస్తున్నావు అని భగవంతుడికి దండం పెట్టుకుంటుంది ఆ తరువాత తన దీక్ష పూర్తవటంతో గుడికి వెళ్లి డబ్బులన్నీ దేవుడు హుండీలో వేసి ఈ రోజు నా దీక్ష పూర్తయ్యింది అని చెప్పి నిమ్మకాయ దీపం వెలిగిస్తుంది.


ఇదంతా మాన్సీ, ఛాయా అనుని ఫాలో అవుతూ దొంగ చాటుగా గమనిస్తూ ఉంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.