Prema Entha Madhuram Serial Today  Episode: ఫ్యాక్టరీ లో పనులు ఆపేయటానికి జలంధర్ వేసే ప్లాన్లు కొనసాగుతున్నాయి.  ఒక మిషన్ ఆగిపోవడంతో ఆర్య వర్ధన్ ఆ మిషన్ స్వయంగా బాగు చేసి పని కొనసాగేలా చేస్తాడు. 


జలందర్ మళ్లీ మరొక ప్లాన్ చేస్తాడు వాళ్ళు తాగే వాటర్ లో విషం కలుపుతాడు. వర్కర్లందరూ భోజనానికి రెడీ అవుతారు. ఇంతలో అక్కడికి ఆర్య, షిండే , అక్కడికి వస్తారు.  


వర్కర్: ఏరా గిరి మీ చెల్లికి పెళ్ళి కుదిరింది అంటగా 


వర్కర్: అవునన్నా దేవుడి దయవల్ల ఇవన్నీ త్వరగా అయిపోతే కంపెనీ నుండి లోన్ తీసుకొని మా చెల్లి పెళ్లి ఘనంగా జరిపిస్తాను 


వర్కర్: మా అబ్బాయిని పెద్ద కాలేజీలో చదివిస్తాను 


వర్కర్: నేను అయితే సొంత ఇల్లు కట్టుకుంటాను 


వర్కర్: నేనైతే రిటైర్ అయిపోయి వచ్చేడబ్బుతో  భార్య పిల్లల్ని బాగా చూసుకుంటాను 


వర్కర్: మన యాదగిరి అన్నకి కొడుకు కూతురు పుడతారు బాధ్యతలు పెరిగిపోతాయి. పార్టీ అడగాలి. 


 షిండే :  వీళ్ళందరూ ఈ పనిని చాలెంజింగ్ గా తీసుకున్నారు. వాళ్ల వాళ్ల జీవితాలు సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. మీరు ఆనందం కారణం నువ్వే ఆర్య. 


యాదగిరి: అవును సార్ 


ఆర్య: అందరూ బాగుంటారు షిండే. వీళ్ళ  ఆశలన్నీ నెరవేరేలా నేను చేస్తాను మీరు వెళ్లి తింటూ ఉండండి. నేను వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. 


షిండే : యాదగిరి సార్ క్యారేజ్ క్యాబిన్లో ఉంది నేను వెళ్లి తీసుకొని వస్తాను 


యాదగిరి: గట్లనే సర్ 


అని యాదగిరి ఫ్యాక్టరీ వాళ్ళ కూర్చుని తింటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన జలంధర్ వాళ్లు తినడం, చూస్తూ ఉంటాడు కాసేపటికి నీళ్లు తాగిన వాళ్ళందరూ సొమ్మసిల్లి పడిపోతుంటారు. యాదగిరి , షిండే  ఆర్య ని పిలుస్తారు. జలంధర్ దూరం నుండి  ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆర్య ఇబ్బందిని చూస్తూ  చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తరువాత అదంతా కల అని తెలుసుకొని అయినా కాసేపతిలో జరిగేది ఇదే కదా అని ఆనందిస్తాడు. 


జలందర్ అజయ్ కి ఫోన్ చేసి నీళ్ళలో విషయం కలిపేశాను వాళ్ళందరూ తాగడం పైకి పోవడం అంతా  ఒకేసారి జరిగిపోతుంది మీరు అర్జెంటుగా ఆఫీస్ కి రండి అని చెప్తాడు. చేతులు కడుక్కుందామని పైకెళ్ళిన ఆర్యకి అక్కడ నీటి వాసన చూసి అనుమానం వచ్చి విషం కలిపారని తెలుసుకుంటాడు. తింటున్న ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ  ఈ నీళ్ళలో ఎవరో విషం  కలిపారని చెప్పి నీళ్లు తాగకుండా ఆపేస్తాడు. వెంటనే జలంధర చేసి ఉంటాడని పిలుస్తారు. కానీ మళ్లీ మనం ఏదైనా చేస్తే యాజమాన్యం దీనిని తమకు అనుకూలంగా చేసుకొని పని ఆపించేస్తుందని ఎవరికీ చెప్పకూడదని డిసైడ్ అవుతారు.


ఇంతలో అజయ్ తన భార్యతో కలిసి వస్తాడు. జలంధర్ ని  గట్టిగా అడుగుతాడు.  అందరూ చావు బతుకులో ఉంటారు అన్నావు  కానీ ఇక్కడ అందరూ చక్కగా పని చేసుకుంటున్నారని. భార్య , భర్తలు ఇద్దరు జలంధర్ ని తిడతారు . ఇంతలో రాజ నందిని సేల్స్ అమాంతంగా పెరిగిపోయాయని మీరాకి ఫోన్ వస్తుంది. అలా ఎలా జరుగుతుందని ఆలోచిస్తుండగా, అజయ్ దీనికి కారణం మీనాక్షి ఇచ్చిన ఐడియా అని ఫిక్స్ అవుతాడు.  మీరా, మీనాక్షీ ని గట్టిగా తిడుతుంది.  మీనాక్షి మాత్రం ఆర్య వర్ధన్ గ్రూప్స్ లో ఒక్కదానిని కూడా మిమ్మల్ని  తాకనివ్వను అని గట్టిగా అనుకుంటుంది. 


మరోవైపు రాజనందిని టెక్సటైల్స్ సేల్స్ పెరిగిన విషయం తెలుసుకొని ఆర్య, షిండే, యాదగిరి కూడా చాలా  ఆనందిస్తారు.