Nindu Noorella Saavasam Serial Today Episode:   అరవింద్‌ జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిసిన అమర్‌ తన టీంతో మాట్లాడుతుంటాడు. ఇంతలో రూంలోకి భాగీ వస్తుంది. ఎప్పుడు చూసినా ఈయన ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అని అనుకుని డోర్‌ దగ్గర నుంచి వెళ్లిపోతుంటే అమర్‌, భాగీని పిలిచి మీ నాన్న వాళ్లను రేపు వినాయక చవితికి రావొద్దని చెప్పు అంటాడు. ఎందుకు అని రీజన్‌ చెప్పండి అని  భాగీ అడగ్గానే అయితే సరే అని అమరే, రామ్మూర్తికి ఫోన్‌ చేసి రేపు చిన్న పని పడింది ఇంట్లో పూజ చేస్తామో లేదోనని రేపు మీరేం రావొద్దని చెప్తాడు. కారణం ఏదైనా మీరు ఇలా చెప్పడం ఏం బాగాలేదని భాగీ వెళ్లిపోతుంది. మరోవైపు మంగళ ఏమైందని రామ్మూర్తిని అడుగుతుంది. అమర్‌ రేపు రావొద్దన్నారని చెప్పడంతో చిరాకుగా రామ్మూర్తిని తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు డల్‌ గా గార్డెన్‌ లోకి వెళ్లి కూర్చున్న భాగీని ఒక మిలటరీ అతన్ని ఇక్కడ కూర్చోవద్దని చెప్తాడు. భాగీ వినదు. ఇంతలో ఆరు వస్తుంది.


ఆరు: మిస్సమ్మ ఏమైంది. ఏందుకిలా ఏడుస్తున్నావు.


భాగీ: కూర్చో అక్కా..?


ఆరు: ఆ ఇప్పుడు చెప్పు..


భాగీ: ఆయన వెళ్లి మా నాన్నను పండక్కి రమ్మన్నారని మీకు ఆయన గురించి గొప్పగా చెప్పాను కదా?


ఆరు: అవును చాలా గొప్పగా చెప్పావు. అయితే ఏంటి?


భాగీ: ఇప్పుడు కారణం చెప్పకుండా మా నాన్నకు ఫోన్‌ చేసి పండక్కి రావొద్దని చెప్పారు.


ఆరు: రావొద్దని చెప్పారా? ఆయన అలా చెప్పరే..?


భాగీ: ఆ ఆయన మీ ఆయన మరి అన్ని తెలియడానికి. మా యాంగ్రీ బర్డు అలానే చెప్పారు.


ఆరు: ఆయన మా ఆయనే అందుకే నాక్కూడా తెలుసు ( అని మనసులో అనుకుంటుంది.)


భాగీ: ఆసలు ఆ మనిషి నాకు అర్థం కారక్కా..? ఒకసారేమో చాలా దగ్గర ఉన్నట్లు దగ్గర అయిపోయినట్టు అనిపిస్తారు. మరోక్కసారేమో చాలా దూరం అయిపోయినట్టు ఉంటుంది.


ఆరు: మిస్సమ్మ.. ఆయన ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలాగా?


భాగీ: ఎప్పుడూ నేనే అర్థం చేసుకోవాలా?


 అంటూ అనుమానంగా గేటు వైపు చూసి అక్కా ఎవర్నీ లోపలికి రానివ్వటం లేదు కదా? మీరెలా వచ్చారు అని అడుగుతుంది భాగీ. దీంతో ఫ్లోలో ఆరు నేను వాళ్లకు కనిపిస్తే కదా? అంటుంది.  దీంతో భాగీ షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకున్న ఆరు నేను పక్కింటి అమ్మాయినే కదా నాకు స్పెషల్‌ పర్మిషన్‌ ఉంది అని ఆరు చెప్తుండగానే రాథోడ్‌ వస్తాడు. రాథోడ్‌ను చూసి ఆరు వెళ్లిపోతుంటే..


భాగీ: అక్కా నువ్వు కూర్చో.. రాథోడ్‌ ను చూసి నువ్వు వెళ్లిపోవాలా?     


  దీంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు.


రాథోడ్‌: భాగీ బాధలో ఉన్నప్పుడు వాళ్ల అక్కను ఊహించుకుని మాట్లాడుతుందేమో


 అనుకుని రాథోడ్‌ కూడా కనిపించని ఆరుతో మాట్లాడినట్టు యాక్టింగ్‌ చేస్తాడు. తర్వాత  రాథోడ్‌ జరిగింది చెప్పి అందుకే సెక్యూరిటీ పెంచారు అనగానే భాగీ వెంటనే లోపలకు వెళ్తుంది. తర్వాత అంజు, మనోహరి దగ్గరకు వెళ్లి రణవీర్‌ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వమని అడుగుతుంది. రేపు పండక్కి అంకుల్‌ ను ఇన్వైట్‌ చేద్దామనుకుంటున్నాను. అనగానే మనోహరి వద్దని అంజును తిడుతుంది. మరోవైపు అమర్‌ దగ్గరకు వెళ్లిన భాగీ కోపాన్ని మాత్రమే పైకి చూపించే మీరు ప్రేమను లోపల ఎలా దాచుకోగలుగుతున్నారు అంటుంది. అమర్‌ బయటకు వెళ్లిపోతుంటే అడ్డు పడుతుంది. రొమాంటిక్‌  చూస్తుంది. సారీ చెప్తుంది. మన ఇంటికి ఉన్న థ్రెట్‌ గురించి తెలిసింది. అందుకే మా నాన్నను ఇంటికి రావొద్దన్నారు అని అర్థం అయింది అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట