Nindu Noorella Saavasam Serial Today Episode: తమిళ డ్రైవర్‌ మనోహరికి ఫోన్‌ చేసి.. డూప్లికేట్‌ నగలు ఇస్తావా? అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. మళ్లీ ఇంట్లోకి వెళ్లి నగలు చెక్‌ చేస్తుంది. నా దగ్గర ఉన్నవి కూడా డూప్లికేట్‌ నగలేనని చెప్పడంతో నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అంటూ రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నా లేదంటే అమర్‌కు నిజం చెప్తానని ఫోన్‌ కట్‌ చేస్తాడు డ్రైవర్‌. మరోవైపు రాథోడ్‌, మిస్సమ్మ నగల బ్యాగ్‌ గురించి మాట్లాడుకుంటుంటే నిర్మల వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు. అంటూ అడగ్గానే అమర్‌ సార్‌ బ్యాగ్‌ ఇచ్చారని చెప్పడంతో అవి అరుంధతి నగలు నీకిచ్చాడా? అయితే నగలు సేఫ్‌గానే ఉంటాయి అని నిర్మల అనడంతో రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు. వెంటనే బయటకు వెళ్లిపోతారు.


మిస్సమ్మ: రాథోడ్‌ గారు మనం ఇంటికి వెళ్లేసరికి లేట్‌ అవుతుంది. ముందు నాన్నకు ఫోన్‌ చేసి మనోహరికి బ్యాగ్‌ ఇవ్వొద్దని చెబితే సరిపోతుంది.


అంటూ మిస్సమ్మ వాళ్ల నాన్నకు ఫోన్‌ చేస్తుంది.


మూర్తి: హలో బాగీ..


మిస్సమ్మ: హలో నాన్న నేను నీకిచ్చిన బ్యాగ్‌ మనోహరికి ఇవ్వకండి. నేను ఇప్పుడే వస్తున్నా..


మూర్తి: ఇప్పుడే వచ్చి బ్యాగ్‌ తీసుకెళ్లిపోయిందమ్మా!


మిస్సమ్మ: బ్యాగ్‌ మనోహరికి ఇచ్చేశారా?


మూర్తి: ఏమ్మా ఏదైనా సమస్యా?


మిస్సమ్మ: ఏం లేదు నాన్న మనోహరి ఇంట్లోనే ఉందా? బ్యాగ్‌ దగ్గరలోనే ఉందా?


మూర్తి: లేదమ్మా తీసుకెళ్లి చాలాసేపు అయ్యింది.


అనగానే మనోహరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పు నాన్న అంటూ మిస్సమ్మ అడగ్గానే జరిగింది మొత్తం చెప్పగానే సరే నాన్న మళ్లీ చేస్తాను అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు మనోహరి జువ్వెల్లరీ షాప్‌కు వెళ్తుంది. మనోహరిని ఫాలో అవుతూ మిస్సమ్మ, రాథోడ్‌ షాపుకు వస్తారు. మనోహరి కోపంగా షాపు ఓనరును రెండూ డూప్లికేట్‌ నగలు ఇచ్చావేంటి అంటూ నిలదీయగానే మూడో సెట్టు చెక్‌ చేసుకోవాల్సింది అంటూ ఓనరు చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. మూడో సెట్టు ఎంటి అని మనోహరి అడగ్గానే నిన్న ఒకావిడ వచ్చిందని మీరు చెప్పారని మూడో సెట్టు చేయమని చెప్పిందని ఓనరు అనగానే మనోహరి తన ఫోన్‌లో నీల, మిస్సమ్మ  ఫోటో చూపించి వీళ్లేనా అని అడుగుతుంది. కాదని ఓనరు చెప్తాడు. మరోవైపు మంగళ నగలు వేసుకుని నేనే అది నేనే అంటూ పాట పాడుతుంది. ఇంతలో మూర్తి వస్తాడు.


మూర్తి: మంగళ.. మంగళ డోర్‌ కూడా తెరచి ఉంది. ఇది ఎక్కడుందబ్బా?


మంగళ: ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను.


మూర్తి: ఎక్కడున్నావే మాట వినిపిస్తుంది మనిషివి కనిపిస్తలేవు?


మంగళ: ఇక్కడున్నానండి.. ఇక్కడ


మూర్తి: అక్కడేం చేస్తున్నావే? బయటకు రా?


అనగానే మంగళ రాలేనని చెప్పగానే సరేలే రోడ్డు మీద వస్తుంటే ఉంగరం ఒకటి దొరికింది. నువ్వు రావడం లేదుగా భాగీకి ఇస్తానులే అనగానే మంగళ పరుగెత్తుకొస్తుంది. దీంతో మంగళ ఒంటిమీద నగలు చూసి మూర్తి ఎక్కడివి అని నిలదీస్తాడు. ఇంతలో గిల్టీ నగలు వేసుకుని ఏం ఫోజుకొడుతున్నావు అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు రాథోడ్‌, మిస్సమ్మ ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటారు.


రాథోడ్‌: ఇప్పుడు ఆ వర్జినల్‌ నగలు ఎవరు తీసుకెళ్లినట్లు మిస్సమ్మ. మనోహరి అమ్మగారు ఆ నగలు ఎవరికి  ఇస్తుంది. అసలేం జరుగుతుందో ఎవరేం చేస్తున్నారో?


మిస్సమ్మ: ఒక్కటి మాత్రం క్లారిటీగా ఉంది. మనోహరి ప్లాన్‌ ఎవరికో తెలుసు? వాళ్లు మనోహరికి కూడా తెలియకుండా నగలు తీసేసుకున్నారు. మనం ముందు ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి.


అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అమర్‌ వస్తాడు. నిర్మల రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ అడగ్గానే తాను మనఃస్ఫూర్తిగా చేసుకోవడం లేదని ఏదో పెళ్లి తంతులాగా ముగిస్తే సరిపోతుంది అంటూ అమర్‌ చెప్పగానే నిర్మల నీకైతే రెండో సారి పెళ్లి కానీ మనోహరికి ఇదే మొదటి పెళ్లి కదా గ్రాండ్ గా చేస్తే బాగుంటుంది. అని చెప్పగానే మిస్సమ్మ కూడా అదీ నిజమేనని చెప్పి మేడం నగలు తాళిబొట్టు తీసుకొచ్చి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పగానే అమర్‌ సరేనంటాడు. మనోహరికి ఫోన్‌ చేసి నగలు తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. దీంతో భయంగా మనోహరి సరే అంటుంది. తర్వాత మూర్తి ఇంటికి వెళ్తుంది మనోహరి.  అసలు నీ పెళ్లి రేపు అవుతుందా? అని మూర్తి అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటే బెటరేమో!