Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూజాక్షిని ప్రియంవద ఇంటికి తీసుకురాగా అందరూ ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తారు.గోపీ తీసుుకురాకుండానువ్వు ఎందుకు వెళ్లి తెచ్చావని సూర్యనారాయణ ప్రశ్నిస్తాడు.ఇది ఆడవాళ్లకు సంబంధించిన విషయమని చెప్పడంతో సుకన్య  సింధూ కడుపుతోఉందా అని ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ చప్పట్లతో హడావుడి చేసి పదేపదే అడుగుతారు.దీంతో సింధూజాక్షి కూడా అవునని అబద్ధం చెబుతుంది. ఆ మాటలకు అందరూ చాలా సంతోషిస్తారు. వెంటనే సింధూను కూర్చోబెట్టి  ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతారు.సింధూ వాళ్ల అమ్మ చాలా సంతోషపడుతుంది. నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేసినందుకు మాఅందిరితో నువ్వు మాట్లాడకపోతుంటే అక్కడ ఎన్నో ఇబ్బందులుపడుతున్నావని అనుకున్నానని....కానీ ఇప్పుడు ఈశుభవార్త తెలిసినతర్వాత నా అనుమానాలన్నీ తొలగిపోయాయని అంటుంది. నువ్వు అక్కడ చాలా సంతోషంగా  ఉన్నావని అర్థమవుతుందని అంటుంది. ఇంత త్వరగా  భర్తతో కలిసిపోయి ఇంత మంచి శుభవార్త చెబుతావని అనుకోలేదని అంటుంది.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి లక్ష్మీని చూస్తాడా! భుజంగం నుంచి భార్యని కాపాడుకోగలడా!

గోపీతో నీకు పెళ్లి సంబంధం చూసినప్పుడు ఈ ఇంట్లో అందరూ నన్ను ఓ శత్రువులా చూశారని..కానీ నా మనస్సాక్షి మాత్రం నేను తప్పు చేయడం లేదని చెప్పిందని...ఇప్పుడు అదే నిజమని నువ్వు నిరూపించావని సూర్యనారాయణ సింధూజాక్షితో అంటాడు. ఇంతలో సుకన్య కలుగజేసుకుని ఇంతమంచి శుభవార్త ఉంటే గోపీ నిన్ను ఒంటరిగా ఎలా పంపించాడని...కట్టుబట్టలతో పుట్టింటికి ఎవరినైనా పంపిస్తారా అని నిలదీస్తుంది.ఏదీఏమైనా మీ ఆయన పద్ధతి ఏం బాగాలేదని అంటుంది.దీంతో ప్రియంవదకు వాళ్ల వదినపై కోపం వస్తుంది. అలాంటిదేమీలేదని...సింధూను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పొలానికి పురుగుల మందులు ఏవో కొడుతున్నాడని....ఆ పనులన్నీ ముగించుకుని రెండు,మూడరోజుల్లో వచ్చేస్తానని చెప్పాడని చెబుతుంది.  ఇంతలో ఇందిర కలుగజేసుకుని మా మనవరాలు అప్పుడే శుభవార్త తెచ్చిందని....ఇక మీ వంతేఉందని శ్రీలక్ష్మీతో అంటుంది.

Also Read: నిండు మనసులు: గణకి సిద్ధూ మాస్ వార్నింగ్! ప్రేరణని సిద్ధూ క్షమించేశాడా!

ఇంటికి తీసుకువెళ్లి వెంటనే మళ్లీ పంపిస్తానని చెప్పి  ఇప్పటి వరకు కనీసం ఫోన్‌కాల్‌ కూడా చేయలేదని  గోపీ వాళ్ల అమ్మ మండిపడుతుంది.అక్కడ వీళ్లు ఏం చెప్పి చచ్చారో...ఆ పెద్దాయన  ఏం అనుకుంటున్నాడోనని కంగారుపడుతుంది. ఏదీ బిజీగా ఉండి చేసి ఉండరులేనని గోపీ అంటాడు.కనీసం  శ్రీలక్ష్మీ అయినా ఫోన్ చేసి అడగలేదని మండిపడుతుంది.

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్‌ - గగన్‌ తో ఆటాడుకున్న భూమి

నువ్వు ఫోన్ చేసి విషయం కనుక్కోమని కొడుకుని ఆదేశిస్తుంది. అక్కడ సింధూ ప్రియంవదతో మనం తప్పు చేశామని అంటుంది.ఈ నిజం ఇప్పుడు కాకపోయినా రేపయినా బయటపడుతుందని అంటుంది. ఒకవేళ గోపీకి తాతయ్య ఫోన్ చేసినా.....గోపీ తాతయ్యకు ఫోన్ చేసినా మన బండారం బయటపడుతుందని భయపడుతుంది. నువ్వేం భయపడకని ప్రియంవద సర్దిచెబుతుంది. నిజం చెప్పేద్దామని అంటే....విడాకులు తీసుకోవాడనికి సిద్ధమయ్యావని తెలిస్తే ముందు తాతయ్య నిన్నే చంపేస్తారని ప్రియంవద సింధూను హెచ్చరిస్తుంది. ఇంతలో గోపీ ఫోన్ చేసినా సింధూ లిప్ట్ చేయకపోవడంతో గోపీ శ్రీలక్ష్మీకి ఫోన్ చేస్తాడు. లక్ష్మీ వెంటనే కంగ్రాట్స్‌ చెప్పడంతో అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదని గోపీకి అర్థమవుతుంది. మీ వదినకు ఫోన్ ఇస్తావా అని చెప్పగా...లక్ష్మీ సింధూ దగ్గరకు వెళ్తుంది. నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడతానని అప్పటి వరకు నన్ను విసిగించొద్దని అంటుంది. దీంతో లక్ష్మీ భయటకు వెళ్లిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: చిన్ని కడుపులో కావేరి పుడుతుందా! దేవాకి ఊహించని షాక్!