Jagadhatri  Serial Today Episode: సత్యప్రసాద్‌ విషయలో జగధాత్రి చెప్పింది నిజమే అయితే మన మాధురి జీవితాన్ని కాపాడింది అవుతుంది అని కౌషికి అనడంతో నేను చెప్పింది తప్పే అయితే  ఆయనకు క్షమాపణలు చెప్పడమే కాదు. ఆయన కాళ్లు పట్టుకోవడానికి కూడా నేను సిద్దమే అంటుంది ధాత్రి. దీంతో నిజానిజాలు తెలిశాకే పెళ్లి గురించి మాట్లాడుదామని కౌషికి చెప్పడంతో అంతేనని సుధాకర్‌ చెప్పి ధాత్రి, కేదార్‌లను పైకి వెళ్లమని చెప్తాడు. సరేనని పైకి వెళ్తారు. బూచి వచ్చి నిషికను తన మాటలతో రెచ్చగొడతాడు. తర్వాత ధాత్రి, కేదార్‌ ఏదో షూటింగ్‌ దగ్గరకు వెళ్లి బాబును వెతుకుతారు.


ధాత్రి: ఈ బాబుతో చిన్న పని ఉండి వచ్చాము.. పది నిమిషాలు టైం ఇస్తే మాట్లాడేసి వెళ్తాము. బాబు మీ పేరెంట్స్‌ ఎక్కడ.


బాయ్‌: పక్కనే ఉన్నారండి.. అమ్మా ఇటు రామ్మా..


బాబు తల్లి: నేనేనండి బాబు తల్లిని..


కేదార్‌: మీరు పేరెంట్స్‌ అయితే రెండు రోజుల క్రితం బాబును తీసుకుని మా ఇంటికి వచ్చిన అతను ఎవరు?


ధాత్రి: మాకైతే అతనే తండ్రి అని మా వదినను పెళ్లి చేసుకుంటానని చెప్పారు.


 బాబు గురించి కౌషికిని రెండో పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన మన్మథ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. షూటింగ్‌ లో ఉన్న మన్మథ దగ్గరకు వెళ్లి పెళ్లిచూపులకు ఎందుకు వచ్చావని ఎవరు చెప్తే వచ్చావని అడిగేసరికి మన్మథ బెదిరిస్తాడు. రెండు తగిలించాక మన్మథ తనను దివ్యాంక ఆ నాటకం ఆడమని డబ్బులిచ్చారని చెప్తాడు. దీంతో మన్మథను తీసుకుని ఇంటికి వస్తారు ధాత్రి, కేదార్‌. నిజం తెలియడంతో కౌషికి ఆవేశంతో దివ్యాంకను కొడుతూ.. చంపేయబోతుంది. దీంతో అందరూ అడ్డుకుంటారు.    


నిషిక: అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? వదిన


ధాత్రి: నువ్వు అడగాల్సింది వదినను కాదు నిషి. ఈ దివ్యాంకను. పగ ప్రతికారం పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తుంది.


నిషిక: మధ్యలో మాట్లాడావంటే చెంప పగులుద్ది. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నోరు మూసుకుని ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో..


ధాత్రి: ఇంకోక్కసారి దివ్యాంక విషయంలో ఆమెను వెనకేసుకొస్తే నువ్వు కాదు నేనే నీ చెంప పగులగొడతాను.


నిషిక: నాకే ఎదురు మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు


అంటూ ధాత్రిని నిషిక కొట్టబోతుంటే కౌషికి అడ్డు వస్తుంది. ధాత్రి నా మనిషి. నా విషయంలో ధాత్రికి మాట్లాడే హక్కు ఉంది. అనగానే దివ్యాంక, వైజయంతి ఇద్దరూ కలిసి ఇదంతా నాటకం అన్నట్లుగానే దివ్యాంకే చేయించింది అనేది కూడా నాటకం అయ్యుండొచ్చు కదా అని ప్రశ్నిస్తారు. దీంతో ధాత్రి, మన్మథ ఫోన్‌ తీసుకుని దివ్యాంక అతనితో ఇదంతా చేయించకపోతే మన్మథకు ఎందుకు డబ్బులు వేసింది. అని మన్మథ ఫోన్‌ తీసుకుని చూపించగానే సుధాకర్‌, దివ్యాంకను తిడతాడు.


కౌషికి: నీకెలా థాంక్స్‌ చెప్పాలో తెలియడం లేదు ధాత్రి. నా భర్త కూడా నన్ను నమ్మనప్పుడు నిజాన్ని బయటపెట్టి నా గౌరవాన్ని కాపాడారు. థాంక్స్‌.


ధాత్రి: నాకు థాంక్స్‌ చెప్తున్నారేంటి వదిన. ఇది నేను చేసిన సహాయం కాదు. నేను తీర్చుకోవాల్సిన బాధ్యత.


సురేష్‌: కౌషికి సారీ..


కౌషికి: సారీయా? చెప్పకు సురేష్‌. ఆ రోజు ఒకడు వచ్చి చెప్పాడని కోపంతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు ఇదంతా దివ్యాంక ప్లాన్‌ అనగానే సారీ చెప్తున్నావు. ఇందులో నా మీద నమ్మకం ఎక్కడుంది సురేష్‌.


  అని కౌషికి చెప్తుంటే ధాత్రి ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూడాలనుకుంటుంది. ఇంతలో కమలాకర్‌ కౌషికి మనసులో అపార్థం పెరిగేలా మాట్లాడతాడు. కౌషికి వెళ్లిపోతుంది. సురేష్‌ కూడా కౌషికి దగ్గరకు వెళ్తాడు. ఏమోషనల్‌‌గా ఫీలవుతూ ఏడుస్తుంటాడు. ఇంతలో కౌషికి స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్‌ వచ్చి పరీక్షించి తను ప్రెగ్నెంట్‌ అని చెప్పడంతో నిషిక, వైజయంతి, కమలాకర్‌, యువరాజ్‌ షాక్‌ అవుతారు. సుధాకర్‌, సురేష్‌, ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: 'లైగర్' ఫ్లాప్... పూరికి రాజమౌళి తండ్రి ఫోన్... ఎమోషనలైన డైరెక్టర్!