Jagadhatri Serial Today Episode: ధాత్రి, కేదార్‌లు ఇక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చోను అని నిషిక చెప్పగానే ధాత్రి తాము పక్కకు వెళ్లిపోతామని చెప్పగానే వారిని అఖిలాండేశ్వరి ఆగండి అని డబ్బు ఉండగానే పెద్దవాళ్లు అయిపోరని.. డబ్బులుంటే ధనవంతులవుతారు. మంచి గుణం ఉంటే గొప్పవాళ్లవుతారని చెప్తుంది. దీంతో నిషిక షాక్‌ అవుతుంది. ఇంతలో దివ్యాంక వస్తుంది. ఇన్విటేషన్‌ లేకుండా సెక్యూరిటీని దాటుకుని ఎలా వచ్చిందో కనుక్కోమని అఖిలాండేశ్వరి దేవకు చెప్తుంది. దీంతో నిషిక తానే ఇన్వైట్‌ చేశానని చెప్పడంతో కౌషికి నిషికను తిడుతుంది. నువ్వు ధాత్రిని ఎలా పార్టీకి రమ్మన్నావో నేను అలాగే దివ్యాంకను పిలిచాను అంటుంది. తర్వాత దివ్యాంకను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది.


నిషిక: అసలు అడిగి మరీ ఈ పార్టీకి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు దివ్యాంక.


దివ్యాంక: ఈ అఖిలాండేశ్వరితో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి నిషి.


నిషిక: సరే ఏం చేసినా డౌట్‌ రాకుండా చేయ్‌. అసలే ఆ జగధాత్రి, కౌషికి వదిన గుడ్లగూబల్లా నిన్నే చూస్తూ ఉంటారు.


 దూరం  నుంచి ధాత్రి వింటుంది.  


ధాత్రి: ఇక్కడ ఏమైనా చేయాలని చూసినా.. ఎవరినైనా బాధపెట్టాలని చూసినా.. నేను చూస్తూ ఊరుకోను


నిషి: దీనివి పాము చెవులు ఏమైనా మాట్లాడుకున్నా ఇట్టే పసిగట్టేస్తుంది.  ఏమైనా అంటే మేం ఏం చేస్తామే.. అయినా మేము మాట్లాడుకుంటుంటే వచ్చి చాటుగా వినడానికి సిగ్గు లేదా?


  అనగానే మీరు ఏం ఆలోచికస్తున్నారో నాకు తెలుసు అంటుంది. దీంతో దివ్యాంక అయితే నేను ఏమనుకుంటున్నానో చెప్పు అంటుంది. అఖిలాండేశ్వరి నీకు ఈవెంట్స్‌ కవరేజ్‌ ఇవ్వలేదని ఆమెపై రివేంజ్‌ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు అంటుంది. దీంతో దివ్యాంక షాక్‌ అవుతుంది. తర్వాత దివ్యాంక కోపంగా ధాత్రికి వార్నింగ్‌ ఇస్తుంది. నన్ను అవమానించిన వాళ్ల లెక్కలు అన్నీ సరిచేస్తాను అంటుంది. దీంతో నేను ఒక్క అరగంట కాన్‌సంట్రేషన్‌ చేస్తే నీ ఎంగేజ్‌మెంట్ రోజు ఏం జరిగిందో తెలుసుగా అంటూ ధాత్రి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు హేమ రూంలోకి వెళ్లిన పార్వతికి హేమ కనిపించకపోవడంతో కంగారుగా మొత్తం వెతుకుతుంది. మరోవైపు యువరాజ్‌ రౌడీల సాయంతో  హేమను కిడ్నాప్‌ చేస్తుంటే ధాత్రి వచ్చి అడ్డుపడుతుంది. ఇంతలో  పార్వతి, ధాత్రిని పిలవడంతో ధాత్రి లోపలికి వెళ్లిపోతుంది. రౌడీలు బయటకు వెళ్లిపోతారు. పార్వతి హేమ కనిపించలేదని చెప్తుంది. యువరాజ్‌, మీనన్‌కు ఫోన్‌ చేసి అమ్మాయిని పంపిచానని చెప్తాడు. దీంతో మీనన్‌ చాలా హ్యాపీగా ఫీలవుతాడు.


పార్వతి: ధాత్రి ఎక్కడైనా కనిపించిందా?


కేదార్‌: తనతో పాటు రూంలో ఎవరైనా ఉన్నారా?


పార్వతి: రూంలో నిషిక ఉంది.


అంటూ హేమను  వెతకడానికి వెళ్తారు. మరోవైపు


అఖిల: నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది కౌషికి. నీ పట్టుదల, నువ్వు బిజినెస్‌ చేసే స్టైల్‌, ప్రయారిటీస్‌, నువ్వు తీసుకునే నిర్ణయాలు అన్నిట్లో సేమ్‌ నాలాగే ఉన్నావు.


దివ్యాంక: అన్నింట్లో మీలా ఉన్నా... ఒక్కదాంట్లో మాత్రం మీకు ఈవిడకు చాలా తేడా ఉంది.


అఖిల: తేడానా.. నాకు కనిపించని తేడా నీకేం కనిపించింది.


అని అడగ్గానే మీలా కౌషికికి ఫ్యామిలీని చూసుకోవడం రాదు. అనగానే ఇద్దరు కలిసుండటమే కష్టమవుతున్న ఈ రోజుల్లో మూడు ఫ్యామిలీలు కలిసి ఉండటం గ్రేట్‌ కదా అనగానే... దివ్యాంక అంటుంది ఈ ఫ్యామిలీల గురించి కాదు మా అక్క ఫ్యామిలీ గురించి అని కాచి చెప్పగానే..  కౌషికి బాధపడుతుంది. కోపంగా దివ్యాంకను తిడుతుంది. దివ్యాంకను అఖిలాండేశ్వరి తిడుతుంది. కౌషికిని వెనకేసుకొస్తుంది. ఇంతలో పార్వతి, ధాత్రి, కేదార్‌ వచ్చి హేమ కనిపించడం లేదని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.  ఇంతలో హేమ ఫాథర్‌ ఆ మీనన్‌ నా కూతురిని కిడ్నాప్‌ చేసి ఉంటాడని బాధపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: 'పుష్ప 2' టీజర్‌ అప్‌డేట్‌, యాక్షన్‌ మోడ్‌లో చిరంజీవి - నేటి టాప్ సినీ విశేషాలివే!