Jagadhatri Serial Today Episode: ఇంటి పరువు ప్రతిష్ఠల గురించి కౌషికి చెబుతుంటే...యువరాజు బిగ్గరగా నవ్వుతాడు.ఈ ఇంటికి పరువు ఏమైనా ఉందా అని అంటాడు. మా నాన్న పెళ్లికి తండ్రి అయ్యాడంటూ ఒకడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడని...మా అమ్మ కూడా ఒకరిని కన్నదంటూ మరొకరు వచ్చారని అంటాడు. ఇంకా ఈ ఇంటికి పరువు ఎక్కడ ఉందని నిలదీస్తాడు. అమ్మా,నాన్న గురించి అలా మాట్లాడుతున్నావేంటని కౌషికి మండిపడుతుంది.బుద్ది చెప్పాల్సిన పెద్దవాళ్లే తప్పులుచేస్తుంటే..ఇక మేం ఎవరిని చూసి నేర్చుకోవాలని అక్క అంటాడు.ఇంట్లోఎవరికి నచ్చినట్లు వాళ్లు చేసుకుంటున్నప్పుడు...మాకు మాత్రమే ఎందుకు ఈ రూల్స్ అంటాడు.గతంలో తప్పు చేసి భవిష్యత్ను ఆగం చేసుకోవద్దని కౌషికి అంటుంది. వాళ్లు ఎప్పుడో తప్పులు చేశారని..ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తారా అని అంటుంది. ఈ కుటుంబంతో సంబంధం లేనివాళ్లంతా ఇంట్లో తిరుగుతుంటే...మనసులో ఏం పెట్టుకోకుండా ఎలా ఉంటాం వదినా అని నిషిక కూడా అంటుంది. అమ్మానాన్నను చూడాలంటేనే అసహ్యంగా ఉందని యువరాజు అంటాడు. ఇంట్లో తప్పులు చేస్తున్న వాళ్లను వదిలేసి నిషిని అంటే ఒప్పుకోనంటూ..యువరాజు నిషికకు మద్దతుగా నిలుస్తాడు. యువరాజు అన్న మాటలన్నీ వాళ్ల అమ్మ వైజయంతి వింటుంది. నాకు ఇన్ని అవమానాలు జరగడానికి ఆ శ్రీవల్లియే కారణమని..దాన్ని ఇంట్లో నుంచి వీలైనంత త్వరగా బయటకు పంపించేయాలని అనుకుంటుంది.
ఊళ్లో జరిగే అన్ని కేసులు పరిష్కరించే మనం మనకు సంబంధించిన కేసుల్లో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నామని ధాత్రి కేదార్తో అంటుంది. మా అమ్మ నిర్దోషి అని...నువ్వు ఈ ఇంటి వారసుడివేనని ఎందుకు నిరూపించలేకపోతున్నామని ధాత్రి అంటుంది. దీంతో జేడీకి జగధాత్రికి ఎంతో తేడా ఉందని....అందుకే మన కేసులు ముందుకు పడటం లేదని అంటాడు. ఇంతలో దుబాయ్ నుంచి వజ్రాలు తెప్పించిన మీనన్..,వాటిని సిటీలోని డీలర్లకు సరఫరా చేసేందుకు నిషికకు కబురుపెడతాడు. వజ్రాలు అనుకున్నట్లు చేర్చితే...కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంతో నిషిక ఓకే అంటుంది. రాత్రికి వజ్రాలు మాఇంటి గేటు వద్దకు పంపించమని చెబుతుంది. మీనన్ మనుషులు పంపించే వజ్రాల కోసం నిషిక గేట్ వద్ద ఎదురుచూస్తుంటుంది. ఆమె భోజనానికి రాలేదని పిలుచుకుని వచ్చేందుకు జగధాత్రి బయటకు వస్తుంది. ఇంతలో మీనన్ మనుషులు నిషికకు బ్యాగ్ ఇవ్వడాన్ని ధాత్రి చూస్తుంది. దగ్గరకు వచ్చి అతను ఎవరని అడుగుతుంది. ఎవరో వచ్చి నిన్ను కలిసి నీకు ఏదో ఇవ్వడాన్ని చూశానని చెబుతుంది. నీ చేతిలో ఏం ఉందో చూపించమని అడిగితే...నిషిక ఏం లేదని చెబుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటే...ధాత్రి గట్టిగా నిలదీస్తుంది. నువ్వు ఏ తప్పు చేయకపోతే...ఎందుకు దాచిపెడుతున్నావని అంటుంది. నీ వంట తినలేక నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాని...అదే ఇదని చెబుతుంది. నీ ప్రవర్తనలో చాలా తేడా ఉందని..ఏదో తప్పుచేస్తున్నావని అనిపిస్తోందని అంటుంది. ఇంటి పరువు తీస్తుంటే చూస్తు ఉరుకోనని ధాత్రి నిషికను హెచ్చరిస్తుంది. అక్కా,చెల్లెళ్లు ఇద్దరూ గొడవపడుతుండగా....కేదార్ వచ్చి భోజనానికి పిలవడంతో లోపలికి వెళ్తారు.
భోజనాల వద్ద వైజయంత్రి తాను సౌభాగ్య వ్రతం చేయాలనుకుంటున్నానని చెప్పగా...సుధాకర్ ఇప్పుడు నాకు ఏం కాలేదు కదా ఇవన్నీ ఎందుకు అంటుంది. దీంతో శ్రీవల్లి చేస్తే మంచిదని అమ్మ చెబుతుంది కదా ఒప్పుకోండి అని బ్రతిమిలాడటంతో అతను ఓకే అంటాడు. దీంతో వైజయంతికి కోపం వస్తుంది.పెళ్లాం మాటవినవు కానీ...కన్నకూతురు చెబితే మాత్రం ఓకే అంటున్నావే అని అంటాడు. ఆమె మాటలకు అందరూ షాక్కు గురవుతారు. జగధాత్రి ఆమెను ప్రశ్నిస్తుంది...శ్రీవల్లి మామయ్య కూతురా అని అడుగుతుంది. నిజం చెబితే ఇప్పుడు నా పని అయిపోతుందని అనుకుంటుంది. కన్న కూతురు కాకపోయినా బాగానే మాట వింటున్నావుఅని అనబోయి ఇలా అన్నానని వైజయంతి తప్పించుకుంటుంది. దీంతో అందరూ భోజనం చేస్తారు..