Guppedanta Manasu  Serial Today Episode: అర్ధరాత్రి వ‌ర‌కు కాలేజీ ప‌నులు చేస్తూ ఉంటుంది వ‌సుధార‌. ఆ ప‌నుల్లో తాము సాయ‌ప‌డుతామ‌ని మ‌హేంద్ర‌, అనుపమ అడుగుతారు. కానీ ఈ ప‌నులు తాను మాత్రమే చేయాల్సిన‌వ‌ని వ‌సుధార చెప్తుంది.  రిషి స‌ల‌హాతోనే ఇవ‌న్నీ చేస్తున్నాన‌ని… కానీ రిషి త‌న ప‌క్కన లేక‌పోవ‌డం బాధ‌ను క‌లిగిస్తుంద‌ని.. రిషితో తన తీపి జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకొని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది.


వసుధార: ఒక‌టా రెండా...రిషితో వంద‌ల జ్ఞాప‌కాలు, వేల అనుభ‌వాలు ఉన్నాయి. అవ‌న్నీ క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్నాయి. అవి ఎప్పుడు గుర్తొచ్చినా నా ముఖంపై చిరున‌వ్వు క‌నిపిస్తూనే ఉంటుంది.


అనుప‌మ: ఇంతకీ రిషితో నీ ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది.


వ‌సుధార: స్టూడెంట్‌లా నేను  డీబీఎస్‌టీ కాలేజీలో అడుగుపెట్టాను. అప్పుడు  నేను స్టూడెంట్‌గా కాలేజీలో చేర‌డానికి ఒప్పుకోని రిషి సార్ ఆ త‌ర్వాత త‌న హృద‌యంలోనే నాకు చోటు ఇచ్చాడు.


అంటూ రిషి త‌న‌కు ఐ ల‌వ్ యూ చెప్పిన క్ష‌ణాల‌ను, త‌న మెడ‌లో తాళి క‌ట్టిన రోజును గుర్తుచేసుకుంటూ ఎమోషన్‌ అవుతుంది వ‌సుధార‌.


మ‌హేంద్ర: రిషి లాంటి వ్య‌క్తి జీవిత‌భాగ‌స్వామి కావాలంటే పెట్టి పుట్టాలి.


అనుపమ: వ‌సుధార లాంటి అమ్మాయి దొర‌క‌డం కూడా రిషి ఏ జ‌న్మ‌లో చేసుకున్న పుణ్య‌మే.. రిషి నిన్ను ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తాడో నువ్వు అంత‌కంటే ఎక్కువ‌గా అత‌డిని ప్రేమిస్తున్నావు వసుధార. త‌న మీద మొద‌ట నీకు గౌర‌వం ఏర్పడింది. ఆ త‌ర్వాత అదే ప్రేమ‌గా మారింది కాబ‌ట్టే మీ బంధం బ‌లంగా మారింది.


 అంటూ నీ క‌న్నీళ్ల‌కు, నిరీక్షణ‌కు ఫ‌లితం దొర‌కుతుంద‌ని, తొంద‌ర‌లోనే మీరిద్దరు సంతోషంగా ఉండే రోజు వ‌స్తుంద‌ని వ‌సుధార‌ను ఓదార్చుతుంది అనుప‌మ‌. వ‌సుధార‌తో పాటు మ‌హేంద్ర కూడా బాధ‌ప‌డ‌తాడు. ఈ ముగ్గురి మాట‌ల‌ను చాటునుంచి వ‌సుధార బావ వింటాడు. వ‌సుధార‌ను చూసి చాలా రోజులైంది ఓ సారి చూసి వెళ్లాల‌ని ఆమె బావ అనుకుంటాడు. వ‌సుధార కోసం కిటికీలో నుంచి ఇంట్లోకి తొంగిచూస్తాడు. అది వ‌సుధార క‌నిపెడుతుంది. ఆమె కంట ప‌డేలోపు త‌ప్పించుకుంటాడు. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లి క‌ర్రను ఇంటి ముందు ప‌డేసి శ‌బ్ధం చేస్తాడు. ఆ చ‌ప్పుడు విని వ‌సుధార బ‌య‌ట‌కు వ‌స్తుంది. వ‌సుధార అందాన్ని చూసి ఆమె బావ ముగ్ధుడైపోతాడు. అదే అందం, అదే వ‌ర్చస్సు వ‌సుధార ఏం మార‌లేద‌ని మ‌న‌సులో అనుకుంటాడు. వ‌సుధార చూడ‌కుండా ఆమెను ఫోన్‌లో ఫొటోలు తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు భ‌ద్రను త‌న ఇంటికి పిలుస్తుంది దేవ‌యాని. అత‌డు అడ‌క్కుండానే చాలా డ‌బ్బు ఇస్తుంది. కానీ ఆ డ‌బ్బు తీసుకోవ‌డానికి భ‌ద్ర ఒప్పుకోడు.


భ‌ద్ర: నాకు డ‌బ్బు మీద ఆశ‌, మ‌క్కువ లేదు. నేను  డ‌బ్బు కోసం కాకుండా స‌ర‌దా కోసమే  క్రైమ్స్‌ చేస్తుంటాను.  


దేవయాని: అయితే నాకో పని చేసి పెట్టాలి. మ‌హేంద్ర ఇంట్లో ఏం జ‌రుగుతుందో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వాలి.. మ‌హేంద్ర‌, అనుప‌మ...రిషి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో గమనించి చెప్పాలి. వ‌సుధార ఇక్క‌డే ఉందా..తిరిగి పుట్టింటికి వెళ్లిందా?


అంటూ  భ‌ద్రను అడుగుతుంది దేవ‌యాని. ఇక మీద మ‌హేంద్ర ఇంట్లో ఏం జ‌రుగుతుందో వెంట వెంట‌నే నాకు చెప్పాల‌ని భ‌ద్రకు చెప్తుంది దేవయాని.


భద్ర: మ‌హేంద్ర మీకు బంధువే క‌దా. ఒక్క ఫోన్ చేస్తే అత‌డే అన్ని విష‌యాలు చెబుతాడు క‌దా


దేవయాని‌: అలాంటి ప‌రిస్థితే ఉంటే నేను నీ స‌హాయం ఎందుకు తీసుకుంటాను.  


అని ఇద్దరూ మాట్లాడుకోవడం ధరణి చూస్తుంది. గేట్ అడ్డం ఉండ‌టంతో భ‌ద్ర ఆమె క‌నిపించ‌డు. దేవ‌యాని ఎవ‌రితో మాట్లాడుతుందో తెలుసుకోవ‌డానికి బ‌య‌ట‌కు వ‌స్తుంది ధ‌ర‌ణి రావ‌డం చూసిన దేవ‌యాని వెంట‌నే భ‌ద్ర‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో ధరణి దగ్గరకు వచ్చేలోపే భద్ర అక్కడి నుంచి వెల్లిపోతాడు. ధరణి దగ్గరకు వచ్చి ఎవ‌రితో మాట్లాడుతున్నార‌ని, మిమ్మల్ని క‌లిసిన ఆ వ్యక్తి ఎవ‌రు అని దేవ‌యానిని అడుగుతుంది. దీంతో  సేల్స్ బాయ్ అని ధ‌ర‌ణితో అబ‌ద్ధం చెబుతుంది. దేవయానిని ధరణి అనుమానించడంతో న‌న్నే ప్రశ్నలు వేస్తున్నావా అంటూ ధ‌ర‌ణిపై ఫైర్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవ‌యాని. ఈమె మ‌ళ్లీ ఏదో కుట్రలు చేస్తుంద‌ని ధ‌ర‌ణి అనుకుంటుంది. మరోవైపు వ‌సుధార వర్క్ లో ఉండ‌గా మ‌రోసారి ఆమె ద‌గ్గ‌ర‌కు మ‌హేంద్ర వ‌స్తాడు.


మహేంద్ర: అమ్మా వసుధార రిషి ఎలా ఉన్నాడు. మళ్లీ రిషికి ఫోన్ చేశావా?. రిషి కండీష‌న్ ఎలా ఉంది? బాగానే ఉన్నాడా?


వసుధార: రిషి సార్‌  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మామయ్యా. ఇంకొన్ని రోజులైతే మామూలు స్థితికి వ‌స్తారు.


మహేంద్ర: ఇంకొన్ని రోజులు అంటూ ఇలా ఎన్ని రోజులు వేచిచూడాలి. రిషికి ఎంత కాలం దూరంగా ఉండాలి. క‌న్న కొడుకుకు అనారోగ్యంగా ఉన్నా అత‌డి ప‌క్కన లేకుండాపోయాను. ఇలా బ్ర‌త‌క‌డం కంటే చ‌చ్చిపోవ‌డ‌మే మంచిద‌నిపిస్తుంది.


వసుధార: రిషి సార్‌ బాగు కోసం కొన్నాళ్లు ఈ బాధ‌ను భ‌రించ‌క త‌ప్పదు మామయ్యా.. శ‌త్రువులు రిషి సార్ కోసం పొంచి ఉన్నారు.  రిషి జాడ‌కు సంబంధించి ఓ చిన్న క్లూ బ‌య‌ట‌ప‌డిన రిషి సార్‌  ప్రాణాల‌కే ప్రమాద‌ం మామయ్యా.


అనుపమ: శ‌త్రువ‌ల వ‌ల్ల రిషికి ఏ ఆప‌ద ఎటు నుంచి వ‌స్తుందోన‌ని వ‌సుధార భ‌య‌ప‌డుతుంది.  నువ్వు ప‌డే వేద‌న‌లో ఎంత న్యాయం ఉందో...త‌న భ‌యంలో కూడా అంతే న్యాయం ఉంది. రిషి కోలుకునే వ‌ర‌కు అత‌డు ఎక్కడున్నాడో ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌డ‌మే మంచిది.


అంటూ మ‌హేంద్రను క‌న్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది  అనుప‌మ‌.. అయినా మ‌హేంద్ర క‌న్వీన్స్ కాడు. క‌న్న కొడుకును క‌ళ్లారా చూడ‌లేక‌పోతున్నాన‌ని, రిషి ఎలా ఉన్నాడో? ఏం తింటున్నాడో? నాతో ఏదైనా మాట్లాడాల‌ని అనుకుంటున్నాడా అనే ఆలోచ‌న‌లు న‌న్ను కుదురుగా ఉండ‌నీయ‌డం లేద‌ని అంటాడు. రిషిని వెంట‌నే చూడాల‌ని వెంట‌నే వెళ్ధామ‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌హేంద్ర‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట