గుప్పెడంతమనసు ఆగష్టు 24 ఎపిసోడ్ (Guppedanta Manasu August 24nd Written Update)


జగతి-మహేంద్రని ఇరికించేందుకు ప్రయత్నిస్తాడు శైలేంద్ర. 
శైలేంద్ర: నేను రాత్రి మంచినీళ్లు కోసం బయటికి వచ్చినప్పుడు మీ గదిలో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఆ రాత్రి అప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అడగలేదు. అప్పటికి ఇంకా వర్క్ చేస్తున్నారా పిన్ని అని అడుగుతాడు
జగతి: అవును
ఫణీంద్ర: నువ్వు కూడానా మహేంద్ర
మహేంద్ర: లేదు అన్నయ్య..మొత్తం జగతినే చేసుకుంది
శైలేంద్ర: అంతా నువ్వు ఒక దానివే చేసుకునే బదులు నాకు కూడా పని అప్పచెప్పొచ్చు కదా పిన్ని నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటాను . పిన్ని నన్ను ఎందుకో ఈ పనులకు దూరంగా ఉంచుతోంది.
మహేంద్ర: నువ్వు అక్కర్లేని విషయాల్లో కలుగ చేసుకుంటున్నావు అందుకే అవాయిడ్ చేస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం లేదు 
దేవయాని-ఫణీంద్ర: నేర్చుకోవాలని తపన పడుతున్నాడు పని నేర్పించండి అని దేవయాని, ఫణీంద్ర కూడా చెప్పడంతో సరే అని ఒప్పుకుంటారు జగతి దంపతులు. 
శైలేంద్ర కూల్ గా మాట్లాడడం చూసిన ధరణి..మా ఆయన ఇంత విధేయత చూపిస్తున్నాడంటే మళ్లీ ఏదో కుట్రకు తెరతీస్తున్నాడనే అర్థం అనుకుంటుంది ధరణి...ఇంతలో ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు..ధరణిని కూడా పంపించేస్తాడు శైలేంద్ర...
రిషి విషయంలో నిజాలు నువ్వే బయటపెట్టాలని మహేంద్ర మనసులో అనుకుంటాడు..వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చర్చ పెట్టుకుంటారు దేవయాని-శైలేంద్ర...


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: నిజం తెలిసి ఏంజెల్ మీద అరిచిన రిషి- మిస్టర్ ఇగోకి ప్రేమలేఖ రాసిన వసుధార


రిషి ఆలస్యంగా నిద్రలేచి వచ్చి హాల్లో కూర్చుంటాడు. లేటుగా లేచావా, రాత్రి ఎక్కడికో వెళ్ళావ్ అంట కదా అంటాడు విశ్వనాథం. అవును సార్ నిద్ర పట్టలేదు అందుకే అలా వెళ్లాను అంటాడు రిషి. మరోవైపు మూడు కాఫీలు తీసుకొచ్చిన వసుని చూసి ఇంకొకటి ఎవరికమ్మా అని అడుగుతాడు చక్రపాణి. రిషి సార్ కి నాన్న.. ఆయన రాత్రి జరిగిన గొడవకి ఇంకా కాఫీ తాగి ఉండరు. ఆయనకి కాఫీ అంటే చాలా ఇష్టం అంటుంది వసుధార. అక్కడ రిషి కూడా వసూని తలుచుకుంటూ కాఫీ తాగుతాడు. ఇద్దరూ మనసులోనే మాట్లాడుకుంటారు...
వసు: నేను తప్పు చేశానా.. నేను చేసుకోబోయే వాడికి మరో వ్యక్తి కోసం లవ్ లెటర్ రాశాను అనుకుంటుంది
రిషి: నువ్వు తెలిసి చేసినా,తెలియక చేసినా నా మనసుని బాధ పెడుతున్నావు
వసు: రిషి సార్ ఏంజెల్ బలవంతం మీద గాని విశ్వనాథ్ సార్ బలవంతం మీద కానీ ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటారేమో అని మనసులోనే  కంగారుపడుతుంది 
రిషి: అలా ఎప్పటికీ జరగదు. నా మనసులో ఎప్పటికీ ఒకరికే స్థానం అనుకుంటాడు 


మరోవైపు కారులో వెళ్తున్న మహేంద్ర వాళ్ళు శైలేంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శైలేంద్ర ఇంత నక్క వినియం ప్రదర్శిస్తున్నడు అంటే మళ్ళీ ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నట్లుగా ఉందనుకుంటారిద్దరు. మనం రిషి మీద పడిన మచ్చని చెరిపేసేలాగా చేయాలి అప్పుడు అందరికీ శైలేంద్ర నిజస్వరూపం తెలుస్తుంది. అప్పుడే రిషి మీ ఇద్దరినీ అర్థం చేసుకుంటాడు అంటాడు మహేంద్ర. శైవేంద్ర ప్రతి అడుగుని అబ్జర్వ్ చేయాలి అంటుంది జగతి. 


Also Read: అర్థరాత్రి వసుధార ఇంటికి రిషి, పెళ్లి గురించి నడిరోడ్డుపై చర్చ పెట్టిన ఈగో మాస్టర్


అద్దంలో వసుతో ముచ్చట్లు


అద్దం ముందు నిల్చున్న రిషికి వసుధార ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేనంటే ఇష్టం లేదంటున్నారు మరి చేతికి ఉన్న బ్రాస్లెట్ ఎందుకు అన్న వసు మాటలు గుర్తొచ్చి పౌరుషంగా తీసేద్దాం అనుకుంటాడు కానీ తీయలేకపోతాడు. ఇది నాది నా ఇష్టం నా ఇష్టం వచ్చినప్పుడు తీస్తాను అంటాడు.
నాకు తెలుసు సార్ అది మీరు తీయలేరు. మీకు నేనంటే ఇప్పటికీ ప్రేమ ఉంది అంటుంది వసుధార. ఇందులో ఏంజెల్ రావడంతో రిషి వాస్తవంలోకి వస్తాడు. రిషికి కర్చీఫ్  ఇస్తుంది  ఏంజెల్. నాకు ఇలాంటివి నచ్చవు, నీకు కాబోయే వాడికి ఇలాంటి పనులు చేయు నాకు కాదు అంటాడు రిషి. నాకు కాబోయే వాడివి నువ్వే కదా, రాత్రి లెటర్ చదవడా,లేదా అని మనసులో అనుకుంటుంది ఏంజెల్. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు అంటాడు రిషి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ అని అయోమయంగా అడుగుతుంది ఏంజెల్. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని గురించే మాట్లాడుతున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అసలు ఏం మాట్లాడాడో, దేని గురించి మాట్లాడేటో అర్థం కాక అయోమయం పడుతుంది ఏంజెల్.


దేవయాని-శైలేంద్ర


మరోవైపు కొడుకుని తన రూమ్ లోకి పిలిచి క్లాస్ వేస్తుంది దేవయాని..మీ పిన్నీ బాబాయ్ ని అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని మందరలిస్తుంది.  దాని వెనక ఉన్న టార్గెట్ డాడీ. డాడీ మన మాట విన్నట్లయితే మనం అనుకున్నది సాధించవచ్చు. డాడీ సపోర్ట్ త్వరలోనే సాధిస్తాను చూడు అంటాడు శైలేంద్ర. నాకు కావలసింది కూడా అదే అంటుంది దేవయాని. 
ఎపిసోడ్ ముగిసింది...