Gruhalakshmi  Telugu Serial Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన దివ్యను బెడ్‌రూంలోకి తీసుకువచ్చి పడుకోబెట్టి నీళ్లు చల్లుతాడు విక్రమ్‌. దివ్య కళ్లు తెరిచి చూడగానే ఇదంతా నావల్లే జరిగింది సారీ దివ్య అంటూ హాస్పిటల్‌కు వెళ్దామని చెప్పగానే వద్దని ఇప్పుడు హాస్పిటల్‌కు వెళ్ళాల్సిన టైం కాదని రెస్ట్‌ తీసుకునే టైం అని చెప్తుంది. అర్థం కానట్లు విక్రమ్‌ చూడగానే తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు ఇండైరెక్ట్‌ గా హింట్‌ ఇస్తుంది దివ్య . దీంతో విక్రమ్‌, ప్రియ సంతోషంగా ఫీలవుతుంటే.. బసవయ్య, ప్రసూనాంబ, సంజయ్‌, రాజ్యలక్ష్మీ షాకింగ్‌ గా చూస్తుంటారు. అనసూయ హాల్లో కూర్చుని బాధపడుతుంటే తులసి వచ్చి..


తులసి: సారీ అత్తయ్య ఏమీ అనుకోవద్దు కఠినంగా మాట్లాడినందుకు


పరంధామయ్య: కఠినంగా మాట్లాడలేదమ్మా.. నిజాలే మాట్లాడావు.  నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయి.


తులసి: మీరు బాధపడతారని చాలా విషయాల్లో నా అభిప్రాయాలను నాలోనే దాచుకునేదాన్ని. ఎందుకో ఈ మధ్య నాలో ఆ ఓపిక తగ్గిపోతుంది. అసహనం పెరిగిపోతుంది.


అని చెప్తుండగానే తులసికి దివ్య ఫోన్‌ చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు చెబుతుంది. దీంతో తులసి చాలా సంతోషిస్తుంది. అత్తమామలకు దివ్యకు ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అయినట్లు చెప్తుంది. దీంతో వాళ్లు సంతోషపడతారు.


అనసూయ: సంతోషం తులసి కన్నీళ్లు తుడుచుకోవడానికి కనీసం ఒక్క శుభవార్తైనా చెవిలో పడింది.


పరంధామయ్య: అవునమ్మా ఇప్పటి వరకు నువ్వు నాన్నమ్మవి.. ఇప్పటి నుంచి నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు.


అని మాట్లాడుకుంటుండగా అక్కడికి నంద వస్తాడు. అనసూయ, పరంధామయ్య  నందాకు దివ్య విషయం చెబుతారు. నంద మామూలుగానే ఉంటాడు. దివ్యను చూడ్డానికి వెళ్దామని అడుగుతే రానని తాను చనిపోయానని చెప్పమని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందా... దీంతో తులసి, అనసూయ, పరంధామయ్య బాధపడతారు. దివ్య కడుపుతో ఉందన్న విషయం తలచుకుని బాధపడుతుంది రాజ్యలక్ష్మీ.


జాహ్నవి: సంతోషించాల్సిన టైం లో  ఈ కోపం ఎందుకు అత్తయ్య


రాజ్యలక్ష్మీ: ఏవరు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి.


జాహ్నవి: మనవడో మనవరాలో పుట్టబోతున్నందుకు సంతోషించాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. నువ్వు తప్పు చేయడం నాకు ఇష్టం లేదు. బావ, దివ్య అక్క సంతోషంగా ఉండాలి.


అని చెప్పి జాహ్నవి వెళ్లిపోతుంది. మాట వింటుంది కదా అని దీన్ని నెత్తినెక్కించుకున్నాను. కానీ ఇదిలా మారిందేమిటి అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తుండిపోతుంది రాజ్యలక్ష్మీ.  తులసి ఆల్బమ్‌లో దివ్య ఫోటోలు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ల అత్తమామలు వస్తారు.


అనసూయ: నందు రాను అన్నాడని బాధపడుతున్నావా?


తులసి: బాధపడటానికి ఆయన రావాలని ఎప్పుడూ ఆశ పడలేదు. కోరుకోలేదు. కేవలం దివ్య బాధపడుతుంది అన్న ఒక్క మాట వల్ల వెనక్కి తగ్గాను. మీరు అడుగుతారు అన్నారు కాబట్టి ఒప్పుకున్నాను.


పరంధామయ్య: ఇలా మొండితనానికి పోతాడనుకోలేదమ్మా కన్నతండ్రిగా ఇలాంటి అవకాశం వదులుకుంటాడనుకోలేదు.


అనసూయ: మన ఆలోచనలు ఒకలా ఉంటే వాడి ఆలోచనలు ఒకలా ఉన్నాయి.


తులసి: మనిషి మారాడు. పశ్చాతాపపడుతున్నాడు అన్నారు కదా అత్తయ్య. ఇదేనా మారడం అంటే? ఇదేనా పశ్చాతాపడటం అంటే?


అంటూ తులసి నంద గోపాల్‌ గురించి బాధపడుతుంది. ఇంతవరకు మీ అబ్బాయి ఎన్నిసార్లు నా మాట విన్నారు. నేను చెప్పింది విన్నారు. ఒక్క దివ్య విషయంలో నేను చెప్పలేదని తప్పు నావైపు చూపిస్తున్నాడు కానీ ఇంతకముందెప్పుడూ ఆయన నా మాట విన్న సందర్భాలే లేవు. అంటూ బాధపడుతుంది తులసి. అయితే పరంధామయ్య, అనసూయలు తులసి బాధను తగ్గించేందుకు ఓదార్పు మాటలు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ముగుస్తుంది.


Also Read: 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: మురారితో తన మనసులో మాట చెప్పేసిన కృష్ణ!