సూరి, భాషకి దొరికిన బకరా కరెన్సీ వాళ్ళని పీల్చి పిప్పి చేస్తాడు. తనకి నచ్చింది తెప్పించుకుని లాగించేస్తూ ఉంటాడు. అది చూసి సూరి ఏడుస్తాడు. తట్టుకోలేక కరెన్సీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారు. కరెన్సీ ఫోన్ లిఫ్ట్ చేసి నా దగ్గర డబ్బులు ఎవరో కొట్టేశారు మీరు నాకు ఒక రూ.50 వేలు పంపించండి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దేవుడమ్మ దేవుడికి పూజ చేస్తూ దేవి కనిపించేలా చెయ్యమని వేడుకుంటుంది. నా బిడ్డ, అటు రాధ దేవి కోసం వెతుకుతుంటే ఇటు సత్య అపార్థం చేసుకుని గుడిలో నిద్రలు చేస్తుంది. ఇద్దరికీ చెప్పలేను. దేవి కనిపించకపోతే నా కుటుంబంలో ఈ కలతలు రావడం ఏంటో అర్థం కావడం లేదని దేవుడమ్మ తన బాధని మొరపెట్టుకుంటుంది. ఎప్పుడు లేనిది సత్య ఈ విషయంలో ఎందుకు అపార్థం చేసుకుంటుందో తెలియడం లేదని బాధపడుతుంది.


Also Read: మాళవిక కన్నింగ్ ప్లాన్- గుండె పగిలేలా ఏడుస్తున్న వేద, అల్లుడిని ఆకాశానికి ఎత్తేసిన సులోచన


మాధవ్ ఎటువంటి టెన్షన్ లేకుండా నిమ్మళంగా కూర్చుని ఉండటం చూసి భాగ్యమ్మ అనుమానపడుతుంది. రాధ నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నాలో తెలియని ఆనందం అలాంటిది నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావని ఆశపడుతుంటే ఆ ఆదిత్య అడ్డు వచ్చేవాడు, ఈసారి మా అమ్మ అడ్డు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసిందని అనుకుంటూ ఉండగా భాగ్యమ్మ కోపంగా వస్తుంది. దేవమ్మ కోసం ఊరంతా చూసిన ఎక్కడా కనిపించలేదు. తనని నీ బిడ్డలాగే చూశావ్ చేతి మీద పచ్చ బొట్టు కూడా వేయించుకున్నావ్ అలాంటిది బిడ్డ కనిపించడం లేదని నా బిడ్డ కంగారుపడుతుంటే నువ్వు నిమ్మళంగా ఉన్నావంటే అనుమానం వస్తుంది. బిడ్డ కనిపించకపోవడానికి నువ్వే కారణం అని అనిపిస్తుందని అంటుంది.


నీ అనుమానాలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాధవ్ చెప్తాడు. మర్యాదగా దేవిని తీసుకొచ్చి నా బిడ్డ చేతిలో పెట్టకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇస్తుంది. నా మీద నీకు అనుమానం కదా దాన్ని నిజం చేస్తాను అప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని మాధవ్ సైలెంట్ గా చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవి కోసం ఆదిత్య, రుక్మిణి వాళ్ళు అనాథ ఆశ్రమంకి వెళతారు. ఒక్కరి కోసం నువ్వు చేసిన త్యాగం నన్ను నా బిడ్డని దూరం చేసింది అని ఆదిత్య రుక్మిణి మీద అరుస్తాడు. రుక్మిణిగా చచ్చిపోయి రాధగా బతికి నీ కష్టాలు నువ్వే తెచ్చుకున్నావ్ అని తిడతాడు. ఆ పొద్దు సత్య కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలని వచ్చేశాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఆ రోజే నేను ప్రాణాలు తీసుకున్న పోయేది ఇలా అయ్యేది కాదని రుక్మిణి ఏడుస్తుంది.


Also Read: బాబోయ్ ఇవేమి అరచకాలు సామీ!- అనసూయకి నూరిపోస్తున్న లాస్య


అనాథ ఆశ్రమం దగ్గర ఒక వ్యక్తి దేవి ఫోటో చూసి ఎవరో ఈ పాపని జీబులో ఎక్కించుకుని వెళ్ళడం చూశాను అని చెప్తాడు. ఎవరు తీసుకెళ్లారు ఎటు వెళ్లారని అడుగుతాడు.  వాళ్ళు కొయ్యగూడెం వైపు వెళ్లారు మీరు అటు వెళ్తే పాప ఖచ్చితంగా దొరుకుతుందని అతను చెప్తాడు. దేవుడమ్మ మాధవ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. బిడ్డ కనిపించకపోతే ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. బిడ్డ కనిపించకపోతే కనీసం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా అని నిలదిస్తుంది. పిల్ల మాతో కాసేపు ఉంటేనే దూరం చేస్తున్నాం అని గొడవ చేస్తావ్ కదా మరి ఇప్పుడు ఏమైంది.. ప్రేమ చూపించాల్సింది ఇప్పుడు అనేసి దేవుడమ్మ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. రుక్మిణి ఇంటికి ఫోన్ చేసి దేవి కనిపించిందంట ఒకాయన చెప్పారు మేము వెళ్తున్నాం నువ్వేమి టెన్షన్ పడకు అని చిన్మయికి ఫోన్ చేసి చెప్తుంది.