Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్ అనుకోకుండా ముద్దు పెట్టుకుంటారు. దాని గురించి జాను ఆలోచిస్తూ మేడ ఉంటుంది. ఇక వివేక్ అక్కడికి వచ్చి అనుకోకుండా జరిగింది ఈసారి అనుకొని చేయొచ్చు కదా అని అంటాడు. ఇంతలో జానుకి ఓ లేడీ కాల్ చేస్తుంది. హోటల్‌కి రమ్మని మనీషా ఫోన్ దొరికిందని అందులో మీ అక్క, అత్తయ్యల వీడియో అందని చెప్తుంది. దాంతో జాను హడావుడిగా పరుగులు తీస్తుంది. లక్ష్మీ ఎక్కడికి అని అడిగితే వచ్చాక చెప్తానని అంటుంది. ఇక మిత్ర గదిలో గాజు పెంకులు పడిన శబ్ధం వస్తే లక్ష్మీ పరుగున వెళ్తుంది. వాటిని తీస్తానని అంటే మిత్ర వద్దని అంటాడు. ఇది నా గది నా గదిలోకి రావొద్దని అంటాడు. మిత్ర ఎన్ని చెప్పినా లక్ష్మీ వినకుండా గాజు ముక్కలు తీస్తుంది. 


మిత్ర: నా మీద నీకు అంత జాలి ఉందా.
లక్ష్మీ: నా మీద మీకు ఎలాగూ లేదు కదా. 
మిత్ర: నేను ఎందుకు నీ మీద జాలి పడాలి.
లక్ష్మీ: అందుకేనా నా మీద రాత్రి మనీషా అన్ని మాటలు అన్నా సైలెంట్‌గా ఉన్నారు. నా మీద మనీషా వేయకూడదని నిందలు వేసింది. అందుకు కూడా నేను బాధ పడలేదు కానీ మీరు మౌనంగా ఉన్నారు.. ఆ టైంలో మీ మౌనమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. నా మీద మీకు కోపం ఉండొచ్చు నన్ను మీ భార్యగా కూడా చూడకపోవచ్చు. కానీ మీ కళ్ల ముందు ఓ ఆడదానికి అవమానం జరిగితే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకు మీ గొంతు అణిచేశారు. ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు. 


లక్ష్మీ గాజు ముక్కలు తీస్తుండగా ఓ పెంకు తగిలి రక్తం వస్తుంది. దాంతో మిత్ర కంగారుగా లక్ష్మీ అని పిలిచి లక్ష్మీ వేలిని తన నోట్లో పెట్టుకుంటాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. తర్వాత మిత్ర లేచి నేను కావాలని చేయలేదని చెప్తాడు. దీన్ని నీకు ఫేవర్‌గా తీసుకోవద్దని అంటాడు.


లక్ష్మీ: నాకు అలాంటి కోరికలు లేవు మీరు గాయ పడకూడదని వచ్చి నేను గాయపడి వెళ్తున్న. నాలుగు గోడల మధ్య ఆడదాన్ని బాధ అర్థం చేసుకోవడం కంటే నలుగురు ముందు ఆ ఆడదాని గౌరవం కాపాడటం ముఖ్యం. 


జాను హోటల‌కి చేరుకుంటుంది. తనకు ఫోన్ చేసిన ఆవిడకు కాల్ చేస్తుంది. ఆవిడ జానుకి గది లోపలికి రమ్మని చెప్తుంది. ఇలాంటి ప్లేస్‌కి నేను రాలేదు నాకు భయం మీరే బయటకు రండి అని జాను అంటే ఏం పర్లేదు ఇది మంచి ఏరియానే లోపలికి రా అని ఆవిడ చెప్తుంది. జాను భయపడుతూనే వెళ్తుంది. ఆవిడ జానుని లోపలికి పిలిచి బెడ్ మీద కూర్చొబెట్టి ఏం భయం లేదని చెప్తుంది. ఫోన్ ఇమ్మని జాను చెప్తే ఆవిడ ఫోన్‌ తీసుకొస్తానని చెప్పి జానుని లోపల కూర్చొపెట్టి తలుపు వేసేస్తుంది.. 


జాను అక్కకి కాల్ చేస్తానని అనుకొని మనీషా ఫోన్ దొరికితే ఒక్కసారి చేసి విషయం మొత్తం చెప్పొచ్చని అనుకుంటుంది. ఇక ఇంట్లో లక్ష్మీ వివేక్‌ జాను గురించి మాట్లాడుకుంటారు. జాను కంగారుగా ఎక్కడికో వెళ్లిందని లక్ష్మీ అంటే నా ముందే తనకు ఏదో ఫోన్ వచ్చింది అందుకే వెళ్లిందని వివేక్ అంటాడు. జరగరానిది ఏదో జరుగుతున్నట్లు గుండె పీకేస్తుందని లక్ష్మీ ఫీలవుతుంది. దేవయాని, మనీషాలు చాటుగా వింటూ తన పథకం స్పీడ్ పెంచాలని అనుకుంటారు. ఇక లక్ష్మీ వివేక్‌తో జానుకి కాల్ చేయమని చెప్తే జాను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఆవిడ దేవయానికి కాల్ చేసి జానుని రూమ్‌లో కూర్చొపెట్టానని చెప్తుంది. తర్వాత మీడియాకు కాల్ చేసి విషయం చెప్తుంది. మనీషా పోలీస్‌లకు కాల్ చేసి హెటల్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తుంది. ఇక జాను ఉన్న గదిలో ఇప్పటికే ఓ వ్యక్తిని ఉంచానని జానుకి ఆ విషయం తెలీదని కాసేపట్లో జాను పని అయిపోతుందని అంటుంది.


మరోవైపు దీక్షితులు గారు అరవిందకు కాల్ చేస్తారు.  మీ ఇంట్లో ఏమైనా శుభకార్యం పెట్టుకున్నారా అని అడుగుతారు. దానికి అరవింద ఏం  లేదు అని అంటుంది. దానికి దీక్షితులు గారు త్వరలో మీ ఇంట్లో ఓ గొప్ప శుభకార్యం జరగబోతుందని అంటారు. అరవింద, జయదేవ్ సంతోషిస్తారు. స్వామీజీ ఇప్పటి వరకు గండాల గురించే చెప్పారని మొదటి సారి శుభకార్యం గురించి చెప్పారని అనుకుంటారు. మరోవైపు పోలీసులు హోటల్‌కి రైడ్‌కి వస్తారు. జాను ఉన్న గదిలోకి వచ్చి చెక్ చేస్తారు. అక్కడ ఓ వ్యక్తి ఉండటం చూసి జాను బిత్తర పోతుంది. తనకు ఏం తెలీదని ఏడుస్తుంది. ఇక మీడియా కూడా వచ్చారని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అప్పుడే తెలియడంతో ఏదో తేడాగా ఉందని అనుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చావని పోలీసులు జానుని అడిగితే జాను జరిగింది చెప్తుంది. ఎవరో నిన్ను కావాలనే ఇరికించారని పోలీస్‌ అధికారి అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: మైత్రి విషయంలో కొట్టుకుంటున్న హర్ష, నందిని, వారం గడువు.. సత్యకి అడ్డంగా బుక్కైపోయిన క్రిష్‌!