chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మి జాను ఇంటికి బుర్కా వేసుకొని వస్తుంది. జానుని చూసినప్పుడు తన చెల్లి గుర్తొస్తుందని ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావని వచ్చానని లక్ష్మి అంటుంది. నాకు ఏం బాధలు లేవు అని జాను అంటే దానికి లక్ష్మి నువ్వు నీ ప్రేమికుడితో మాట్లాడటం నేను చూశానని అంటుంది. ఎందుకో బాధ పడ్డావని, చాలా ఏడ్చావని ఏమైందని అడుగుతుంది.


జాను: తన ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. తన వాళ్ల అనుమతి లేకపోయినా తాళి కడతాను అంటున్నాడు.
లక్ష్మి: అందరిని కాదు అని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అందరిని ఎదురించి నిన్ను తన సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. నువ్వు ఎందుకు కాదు అంటున్నావ్.
జాను: చూడండి మా అక్క కూడా అదే ఇంటికి ఒకప్పుడు కోడలు. తన మీద ఇప్పుడు ఎవరికీ తన మీద సదభిప్రాయం లేదు. చనిపోయినా ఇప్పుటికీ తనని తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఇలా పెళ్లి చేసుకుంటే నా వాళ్లని తిడుతూనే ఉంటారు. మా అక్కకి గౌరవం ఉండదు. నేను ఆ పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు  కానీ మా అక్కకి తలవంపులు తీసుకురాను.
లక్ష్మి: నా గురించి ఎంత ఆలోచిస్తున్నావ్ జాను. కానీ నేనే నీ గురించి ఆలోచించలేకపోయాను. నీ కష్టంలో తోడు ఉండలేకపోయాను.
జాను: ఏమైంది అండి ఎందుకు ఆ కనీళ్లు.
లక్ష్మి: మీ అక్క చనిపోయినా తన గౌరవం గురించి ఆలోచిస్తున్నావ్ అని కాస్త బాధగా అనిపించింది.
జాను: మా అక్క బతికే ఉందని చిన్న నమ్మకం. రేపు ఎప్పుడైనా తను తిరిగి వస్తే తనని మా బావగారిని కలపాలి అని నా సంకల్పం. ఇప్పుడు నేను నా పెళ్లి విషయంలో తప్పటడుగు వేస్తే రేపు మా అక్క జీవితం నిలబెట్టగలనా.


లక్ష్మి జానుని హగ్ చేసుకుంటుంది. ఎమోషనల్ అవుతుంది. నీ లాంటి చెల్లి ఉన్నందుకు మీ అక్క చాలా అదృష్టవంతురాలు అని అంటుంది. దానికి జాను అంత మంచి అక్క ఉండటం తన అదృష్టం అయితే తనని కోల్పోవడం నా దురదృష్టం అని జాను అంటుంది. ఇక జాను లక్ష్మిని ఒకసారి చూడాలి అని అంటుంది. ఎందుకు అని లక్ష్మి అడిగితే నువ్వు నన్ను హగ్ చేసుకుంటే మా అక్క నన్ను హగ్ చేసుకున్నట్లే అనిపించిందని జాను అంటుంది. ఇక లక్ష్మి తన ముఖం చూపించకూడదు అని కవర్ చేస్తుంది. ఇక టీ తీసుకొస్తాను అని లక్ష్మి అంటుంది. కిచెన్‌కి వెళ్లిన లక్ష్మి జాను జీవితం నిలబెట్టాలి అని అనుకుంటుంది. మరోవైపు మనీషా, దేవయానిలు అర్జున్‌ వాళ్ల ఇంటికి వస్తారు. మిత్ర గారి తాలూకా అని పరిచయం చేసుకుంటారు. 


అర్జున్: చూడండి మీరు ఏదో అడగాలి అనుకొని ఇంకేదో మాట్లాడుతున్నట్లు ఉన్నారు. అడగాలి అనుకున్నది సూటిగా అడగండి. 
మనీషా: కొన్నేళ్ల క్రితం మా ఎస్టేట్‌లో ఒకావిడ పని చేసింది. తర్వాత ఆవిడ మీ దగ్గరకు చేరిందని తెలిసింది. తను ఇప్పుడు ఎక్కడ ఉంది. ఎలా ఉంది. 
అర్జున్: తన గురించి మీకు ఎందుకు.
మనీషా: తనకి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం లేదు అండి తన కూతురు..
అర్జున్: ఏమన్నారు తన కూతురు..
దేవయాని: అంటే తనకు కూతురు పుట్టిందా కొడుకు పుట్టాడా అని.
అర్జున్: చూడండి తన అప్పుడే మాకు వదిలేసి వెళ్లిపోయింది. తన గురించి ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. అసలు తన ఎస్టేట్‌కి రాకముందు తన ఎక్కడుండేది. తన వాళ్లు ఎవరు తెలిస్తే తను ఎక్కడికి వెళ్లిందో తెలుస్తుంది కదా. 
మనీషా: వీడేంటి ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నాడు. ఏదీ సరిగ్గా చెప్పడం లేదు. లక్ష్మీ గురించి తెలుసా.. కావాలి అనే చెప్పడం లేదా..


లక్ష్మి టీ తీసుకొని వస్తుంది. అది తాగిన జాను టీ కూడా తన అక్క చేసినట్లే ఉందని అంటుంది. ఇంతలో మిత్ర జాను దగ్గరకు వస్తాడు. మిత్ర ఆ అమ్మాయి ఎవరు అని జానుని అడుగుతాడు. ఇక తన ఇంటికి వచ్చిందని గుర్తు చేసుకుంటాడు. మిత్ర జానుని వివేక్‌తో పెళ్లి గురించి ఒప్పించాలని చూస్తాడు. దానికి మిత్ర లక్ష్మీ మీద సీరియస్ అవుతాడు. తన గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోవద్దని అంటాడు. వివేక్, జానులను పెళ్లి చేసుకోమని మరోసారి చెప్తాడు. దేవయాని పిన్నిని తనని కన్విన్స్ చేస్తామని అవసరం అయితే తన కాళ్లు పట్టుకుంటామని అంటాడు. జాను మాత్రం భయపడుతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా తను చూసుకుంటానని అంటాడు. మిత్ర బయల్దేరుతాడు. ఇక లక్ష్మి కూడా బయల్దేరుతుంది. జాను తన బావని ఖుషి బేగం అని చెప్పిన లక్ష్మిని డ్రాప్ చేయమని అంటుంది. మిత్ర సరే అంటాడు. జాను దగ్గరుండి లక్ష్మిని మిత్ర కారు ఎక్కిస్తుంది. మిత్ర లక్ష్మితో నీ కళ్లు చూస్తుంటే నా భార్య గుర్తొస్తుందని చెప్పబోతూ ఆగిపోతాడు. 


అర్జున్‌ మనీషా, దేవయానిలను వెళ్లిపోమని అంటాడు. జున్ను తల్లి కూడా కనిపించడం లేదు అని అనుకుంటారు. అర్జున్‌ తల్లికి జున్ను తల్లి ఫొటో చూపించమని అంటారు. వసుధార సరే అని ఫొటో తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: . చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: వివేక్ తన బాబాయ్ అని లక్ష్మితో చెప్పిన లక్కీ.. జాను దగ్గర ముసుగులో లక్ష్మి, మిత్ర చూసేస్తాడా!