Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లు అందరూ కలిసి రాజ్‌, కావ్యలను డెకరేట్‌ చేసిన రూంలోకి వెళ్లేలా చేస్తారు. మరోవైపు రుద్రాణి తాను వేసిన బాంబు ఇంకా పేలలేదని ఆలోచిస్తుంది. ఇవాళ ఇంట్లో వాళ్ల ప్రవర్తన తేడాగా ఉందని మాట్లాడుకుంటూ రాజ్‌, కావ్య డెకరేట్‌ చేసిన రూంలోకి వెళ్లి లైట్‌  వేసి చూసి షాక్‌ అవుతారు. అందరూ కలిసి మనల్ని ఇలా ఇరికించారన్నమాట అని ఇద్దరూ అనుకుంటారు.


రాజ్: అబ్బా ఏం నాటకం ఆడుతున్నావే..?


కావ్య: ఏం నటిస్తున్నారండి?


రాజ్‌: నేను నటించడం ఏంటి? నాన్సెన్స్‌.. వాళ్లతో చెప్పి నువ్వే ఈ గది రెడీ చేయించావు.


కావ్య: అవ్వవ్వా ఎంత అబద్దం చెప్పారండి. నేను సిగ్గు విడిచి మాకు శోభనం జరిపించండి అని నేను వాళ్లతో చెప్పనా?


రాజ్‌: మరి నేను చెప్తానా?


కావ్య: ఆ మీరే ఈ గూడు పుఠాణీలో మీకే బాగముంది.


రాజ్‌: ఈ కుంభకోణంలో నీకే బాగముంది.


  అంటూ ఇద్దరూ నువ్వే చేశావని కాదు నువ్వే చేశావని తగువులాడుకుంటారు. ఇంతలో రాజ్‌ ఆత్మ వచ్చి ఎవరు చేస్తే ఏంటి నీ మనసులో మాట ఇవాళ చెప్పాలనుకున్నావు కదా ఇంతకన్నా మంచి చాన్స్‌ రాదని చెప్తుంది. రాజ్‌ రోమాంటిక్‌గా కావ్యకు ప్రపోజ్‌ చేయబోతుండగా కింద కళ్యాణ్‌ గట్టిగా అనామిక అంటూ అరుస్తూ పూల కుండీ పగులగొడతాడు. దీంతో ఏంటా సౌండ్‌ అంటూ రాజ్, కావ్య కిందకు వెళ్తారు.


 


ALSO READ:  ‘కల్కీ 2898 ఏడీ’లో భైరవ ఎంట్రీ సీన్‌కు అంత టైమ్ పడుతుందా? షాకింగ్ విషయం చెప్పిన నాగ్ అశ్విన్


రాజ్‌: ఏంటి కళ్యాణ్‌ ఇదంతా..?


కళ్యాణ్‌: రా నీకోసమే చూస్తున్నాను.


అనామిక: ఏంటి నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు. బయపడి పారిపోతాననుకున్నావా?


కళ్యాణ్‌: నువ్వు ఒక ఆడదానివైతే.. నువ్వు ఒక మనిషివి అయితే నీ పెంపకం సరిగ్గా ఉంటే భర్త అంటే గౌరవం ఉండేది. భార్య అంటే ఎలా ఉండేదో తెలిసేది.


అనామిక: ఏంటిప్పుడు ఎంటి నీ పంచాయతి ఇప్పుడు.


అనగానే కళ్యాణ్‌ కోపంగా పేపర్స్‌ అనామిక ముఖంపై వేస్తాడు. ఆ పేపర్స్‌ ఏంటని అందరూ అడగ్గానే డైవర్స్‌ పేపర్స్‌ అని కళ్యాణ్‌ చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ ఏంటని అడగ్గానే నేను నా భార్య అనే దరిద్రాన్ని వదిలించుకోవడానికి అని కళ్యాణ్‌ చెప్పగానే నన్ను వదిలించుకుని ఆ అప్పును ఏకంగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని చూస్తున్నావా? అనగానే కళ్యాణ్‌ కోపంగా అనామికను కొట్టబోయి ఆగి హోటల్‌ లో జరిగిన సంఘటన నువ్వు  కావాలని క్రియేట్‌  చేశావని హోటల్‌ సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు కళ్యాణ్‌. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు. అయితే ఆ డోర్‌ వేసిన వాడివడో నాకేం తెలుసు అని ప్రశ్నిస్తుంది అనామిక అయితే వాణ్ని కూడా తీసుకొచ్చానని.. ఓరే రాము అని పిలవగానే వాడు వస్తాడు.


ఇందిరాదేవి: ఇతనేగా గడియ పెట్టింది.


కళ్యాణ్‌: అవును నాన్నమ్మ.. రేయ్‌ లోపలికి మేము అడుగుపెట్టగానే బయట గడియ పెట్టమని చెప్పింది ఎవర్రా?


రాము: ఈ మేడం సార్‌ ( అని అనామికను చూపిస్తాడు.)


అనామిక: నాకేం తెలియదు. ఇదంతా ఈ అప్పు కళ్యాణ్‌ కలిసి ఆడుతున్న  నాటకంలా ఉంది. నన్ను అడ్డు తప్పించడానికి ఇదంతా క్రియేట్‌ చేశారు. ఇదంతా అబద్దం.


కళ్యాణ్‌: ఇంకా ఇంకా నా మీద బురద చల్లాలని చూస్తున్నావా? ఓరేయ్‌ నీ ఫోన్‌ ఇవ్వరా


 అంటూ వాడి ఫోన్‌లో వాడి అకౌంట్‌ ఓపెన్‌ చేసి నువ్వు నీ అకౌంట్‌ నుంచి వీడికి ఎందుకు ఇంత డబ్బు పంపించావని ప్రశ్నించడంతో అనామిక షాక్‌ అవుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా ఎందుకు చేశావని అడగ్గానే ఇదంతా నేనే చేశానని.. నాతో కాపురం చేయనని చెప్పి అప్పుతో తిరుగుతావా? అందుకే ఇదంతా చేశాను. నేను చేసింది తప్పా అని ప్రశ్నించడంతో ధాన్యలక్ష్మీ, అనామిక చెంప పగులగొడుతుంది. ఇప్పటివరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.