Brahmamudi Telugu Serial Today Episode:  శోభనం రూంను మా వదిన కావ్య డెకరేట్‌ చేసిందని కళ్యాణ్‌ చెప్పడంతో చిరాకుగా ఫీలవుతుంది అనామిక. దీంతో ఏవో నాలుగు మాటలు చెప్పి అనామికను కూల్‌ చేస్తాడు కళ్యాణ్‌ తర్వాత అనామిక కోసం తీసుకొచ్చిన నెక్లెస్‌ చూపిస్తాడు కళ్యాణ్‌. నెక్లెస్‌ చూసిన అనామిక చాలా బాగుందని.. సూపర్‌ అని చెప్తుంది. దీంతో ఇది కూడా మా వదిన సెలెక్షనే  అంటాడు కళ్యాణ్‌. దీంతో అనామిక మరింత సీరియస్‌ గా నెక్లెస్‌ పక్కకు తోసేసి కళ్యాణ్‌ను తిడుతుంది.


అనామిక: నువ్విలా మాటిమాటికి మీ వదినను మ మధ్యకు తీసుకురావడం నాకు అస్సలు నచ్చడం లేదు.


కళ్యాణ్‌: పాపం తను ఏం చేసింది అనామిక. తను మన మంచి కోరుకుంటుంది.


అనామిక: ఆమె ఎవరి మంచి కోరుకుందో నాకు తెలుసు..


కళ్యాణ్‌: నువ్వు పూర్తిగా మా వదినను అపార్థం చేసుకుంటున్నావు.


అనామిక: నువ్వసలు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటున్నావా? వ్రతంలో కూర్చుని కూడా ఆ అప్పు కోసం మధ్యలో లేచి వెళ్లిపోయావు. ఎవరి గురించో నన్ను బాధపెట్టావు.


కళ్యాణ్‌: ఎవరి గురించో అంటావేంటి? అప్పు మన ఫ్రెండ్‌ కదా


అనామిక: మన ఫ్రెండ్‌ కాదు నీకు ఫ్రెండు. నువ్వేమో ఫ్రెండులా చూశావు. కానీ తను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూసింది.


  అంటూ అనామిక బాధపడుతూ..  ఇంత జరిగాక నువ్వు వద్దు నీ శోభనం వద్దు అని తిడుతూ బయటకు వెళ్లి పడుకుంటాను అని వెళ్లిపోతుంది.


స్వప్న నిద్ర లేచి రుద్రాణికి ఫోన్‌ చేస్తుంది. నిద్ర లేవగానే కాఫీ తీసుకురావాలని తెలియదా అంటుంది. ఈ అలవాటు ఎప్పటి నుంచి అని రుద్రాణి అడుగుతుంది. ఈరోజు నుంచే నని నాకు త్వరగా కాఫీ తీసుకురా అని స్వప్న ఆర్డర్‌ వేస్తుంది. సరేనని రుద్రాణి కింద కిచెన్‌లోకి వెళ్తుంటే హాల్లో పడుకున్న అనామిక కనబడుతుంది. దీంతో ఈ కాపురం కూడా కోల్లేరు అయ్యిందే అని మనసులో అనుకుని అందరినీ నిద్ర లేపుతుంది. అందరూ నిద్ర లేసి హాల్లోకి వస్తారు.


ధాన్యలక్ష్మి: ఎంటి రుద్రాణి ఏమైంది..?


అని అడగ్గానే రుద్రాణి సోఫా మీద పడుకున్న అనామికను చూపిస్తుంది. ధాన్యలక్ష్మీ అనామికను లేపి ఏమైందని అడుగుతుంది. అనామిక ఏడుస్తూ.. ధాన్యలక్ష్మిని హగ్‌ చేసుకుంటుంది.


ధాన్యలక్ష్మీ: రాత్రంత ఇక్కడే పడుకున్నావా?


అనామిక: అవును


అనగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కళ్యాణ్‌ పైనుంచి కిందకు రావడం చూసి


ప్రకాష్‌: అరేయ్‌ ఏమైందిరా?


అపర్ణ: శోభనం గదిలో ఉండాల్సిన పెళ్లి కూతురు. బయట సోఫాలో పడుకోవడం ఏంట్రా? ఏం జరిగింది. ఎందుకు అనామిక బయట పడుకుంది.


  అని అడగ్గానే కళ్యాణ్‌, అనామిక దగ్గరకు వెళ్లి రూంలోకి వెళ్లి మాట్లాడుకుందామని చెప్తాడు. అనామిక వినదు. ధాన్యలక్ష్మీ వచ్చి మేమంతా ఉన్నాము కదా ఏమైంది చెప్పు అనగానే నాముందు ఇప్పుడు రెండు దారులే ఉన్నాయి. ఒకటి మా పుట్టింటికి వెళ్లడం రెండోది చనిపోవడం అంటూ ఏడుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కళ్యాణ్‌, అనామికకు సారీ చెప్పి లోపలికి తీసుకెళ్తుంటే..


రుద్రాణి: అలా ఎలా కుదురుతుందిరా నా కొడుకు కోడలు ఏదైనా గొడవ పడితే రచ్చబండ దగ్గర చుట్టులు కాల్చే బ్యాచ్‌ లాగా పంచాయతి పెట్టి పరువు తీస్తారా? ఇప్పుడేమో ఇంతదాకా వచ్చాక ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా గదిలోకి వెళ్లి తేల్చుకుంటారా? రాత్రి ఏం జరిగిందో చెప్పండి.


అపర్ణ: అనామిక అందరికీ మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నావు. నువ్వే మాట్లాడు. అసలు ఏం జరిగింది. కళ్యాణ్‌ నిన్ను ఏమైనా అన్నాడా?   


కళ్యాణ్‌ ఏమీ అనలేదని తను నన్ను కొట్టినా తిట్టినా ఆ నాలుగు గోడల మధ్య పడి ఉండేదాన్నని కానీ మా మధ్యకు అప్పు ప్రసక్తి తీసుకొస్తున్నారు. ఈ కావ్య ప్రసక్తి తీసుకొస్తున్నారు. అంటూ బాధపడుతుంది అనామిక. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను తిడుతుంది. కావ్యను రాజ్‌ వెనకేసుకొస్తాడు. దీంతో నీ కొడుకును కూడా మార్చేసింది అని అపర్ణకు ధాన్యలక్ష్మీ చెప్తుంది. కళ్యాణ్‌, ప్రకాష్‌ కూడా ధాన్యలక్ష్మీని తిడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: త్రినయని సీరియల్ జనవరి 17th: విశాలాక్షిని టార్గెట్ చేసిన తిలోత్తమ.. కెమికల్స్ కలిపి నెత్తిన నిప్పు పెట్టేసిన తల్లీకొడుకులు!