Brahmamudi Serial Today Episode: పోలీస్‌ యూనిఫామ్‌లో దుగ్గిరాల ఇంటికి వచ్చిన అప్పును రుద్రాణి అవమానకరంగా మాట్లాడుతుంది. ఏంటి పగటి వేషాలు అంటూ వెటకారంగా తిడుతుంది. దీంతో కావ్య కోపంగా పగటివేషాలు వేయాల్సిన అవసరం మా అప్పుకు లేదని నిజంగానే ఎస్సై ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఈ ఊరికే ఎస్సైగా వచ్చిందని చెప్తుంది.


రుద్రాణి:  చాలా సంతోషం మరి ఈ పోలీస్‌ గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు .. నిన్ను నీ మెగుడిని అవమానించినందుకు నీ అత్తకు వార్నింగ్‌ ఇవ్వడానికి వచ్చినట్టా..? లేక దొంగకేసులు పెట్టి అరెస్ట్‌ చేయడానికి వచ్చావా..? ఓ నాకు అర్థం అయింది. నీ పెళ్లికి ఒప్పుకోకుండా నిన్ను అవమానించిన  నీ అత్తయ్యా నిన్ను ఇంట్లోంచి తరిమేసింది కదా..? అలాంటివి ఇకపైన ఏమైనా చేస్తే పోలీస్‌గా ఎంతదూరం అయినా వెళ్తాను అని చెప్పడానికి వచ్చావు కదా


కళ్యాణ్‌: ఎందుకు అత్తయ్యా మీ మనసులో ఉన్న ఆలోచనలను మా మాటలుగా చెప్పాలనుకుంటున్నారు. నా భార్య పోలీస్‌ అయిందని ఈ ఇంటి పెద్దవాళ్లకు చెప్పి వాళ్ల ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చాము.. పెద్దమ్మా..


అపర్ణ: ఒరేయ్‌ ఈ ఇంటికి పెద్ద దిక్కు మీ నాన్నమ్మ గారు. ముందు ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి.. తర్వాత మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకోండి.


అప్పు, కళ్యాణ్‌ ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వెళ్లి  ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ ల ఆశీర్వాదం తీసుకుంటారు.


అపర్ణ:  ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోవాలంటే.. మీరు ఇక్కడే ఉండిపోవాలి.  


రుద్రాణి:  నువ్వు బాగానే చెప్తావు వదిన కానీ కళ్యాణ్‌ అందుకు ఒప్పుకోవాలి కదా.. ఎందుకంటే కళ్యాణ్‌ అనుకున్నట్టుగా ఇంకా మంచిపేరు సంపాదించలేదు. అందుకే రాడనుకుంటున్నాను


కళ్యాణ్‌:  విన్నావా పెద్దమ్మా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇంకా కొంతమంది మమ్మల్ని యాక్సెప్ట్‌ చేయడానికి రెడీగా లేరు. అందరూ ఒప్పుకున్న  రోజు ఇక్కడే ఉండిపోతాం


 ఇందిరాదేవి సరేలేరా ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకు రేపు పాపకు బారసాల జరిపిస్తున్నాము.. మీరు ఇద్దరూ దగ్గరుండి మరీ  బారసాలను గ్రాండ్‌ గా జరిపించాలి అని చెప్తుంది. అందరూ నవ్వుకుంటారు. తర్వాత రాత్రికి స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు గుమ్మం దగ్గర కూర్చుని తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు ఇంతలో లోపల పాప ఏడుస్తుంటే స్వప్వ వెళ్లి పాపను ఎత్తుకుంటుంది. అయినా పాప ఏడుపు ఆపదు. దీంతో కావ్య పాపను తీసుకుని బయటకు వచ్చి జోల పాట పాడుతుంది. పాప ఏడుపు ఆపేసి నిద్రపోతుంది. దీంతో స్వప్న, కావ్యను మెచ్చుకుంటుంది. వాళ్లను గమనిస్తున్న ఇందిరాదేవి, అపర్ణ ఎమోషనల్‌ అవుతారు.


ఇందిర: వీళ్లను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందే..


అపర్ణ: అవును అత్తయ్యా నేను ఈ ఇంటికి కొత్తగా కాపురానికి వచ్చిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను కూడా రాజ్‌ను  ఇలా ఒడిలో పెట్టుకుని జోల పాడేదాన్ని ఒకవైపు మీరు.. మరోవైపు ధాన్యలక్ష్మీ రాజ్‌ను నెత్తిన పెట్టుకుని చూసుకునే వారు


ఇందిరాదేవి:  అవునే ఆ రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. అప్పుడు మన దగ్గర ఇంత ఆస్థి ఉండేది కాదు. కానీ అందరం సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈరోజు కోట్లు ఉన్నా.. ఆ సంతోషాన్ని మాత్రం కొనలేకపోతున్నాం


అపర్ణ:  బాధపడకండి అత్తయ్యా ఆ ముగ్గురిని చూస్తున్నారు కదా..? మన ఇంట్లో దూరం అయిన సంతోషాన్ని తప్పకుండా తీసుకొస్తారు.


అని చెప్పగానే ఇందిరాదేవి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ప్రకాష్‌ దగ్గరకు వెళ్లిన ధాన్యలక్ష్మీ కోపంగా తిడుతుంది. మీరు మౌనంగా ఉంటే మన కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంటూ నిలదీస్తుంది. మీరే వెళ్లి కళ్యాణ్‌తో మాట్లాడండి అని చెప్తుంది. అయితే సరే కాస్త టైం తీసుకుని మాట్లాడతాను అని ప్రకాష్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!