Brahmamudi September 21st:  తనని ఎదిరించి మాట్లాడినందుకు రుద్రాణి కావ్య మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. తన కాంట్రాక్ట్ ఎలాగైనా పూర్తి కాకుండా చేసి దెబ్బకొట్టాలని కొడుకు రాహుల్ తో కలిసి ప్లాన్ వేస్తుంది. కావ్య తయారు చేసిన విగ్రహాలన్నీ రాత్రికి రాత్రి మాయం చేస్తానని చెప్తాడు. ఇక రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..


కృష్ణమూర్తి విగ్రహాల దగ్గర తిరుగుతూ ఉండగా రాహుల్ పంపించిన రౌడీలు వస్తారు. తన మీద అటాక్ చేసి విగ్రహాలన్నీ వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్లిపోతారు. తీసుకెళ్లవద్దని ఎంతగా బతిమలాడినా కూడా వినిపించుకోకుండా కృష్ణమూర్తిని రక్తం వచ్చేలా కొట్టి పడేసి వెళ్లిపోతారు. తెల్లారి విషయం తెలియగానే రాజ్, కావ్య, అప్పు, కనకం కృష్ణమూర్తి దగ్గరకి వస్తారు. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి కావ్య విలవిల్లాడిపోతుంది.


కృష్ణమూర్తి: మనం కష్టపడి చేసిన విగ్రహాలు అన్నీ ఎత్తుకుని వెళ్లిపోయారు


రాజ్: విగ్రహాలు కనిపించడం లేదని బంటి వచ్చి చెప్పగానే మనం ఇక్కడికి వచ్చాం. మనం వచ్చే ముందు మనకి ఒక డీసీఎం ఎదురు వచ్చింది. అందులోనే విగ్రహాలు తీసుకుని వెళ్లారు


కావ్య: నాకు మీరు తప్ప వేరే దారి లేదని అంటుంది


Also Read: రసవత్తరంగా మారిన కథనం- ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న కృష్ణ, ముకుంద


దొంగలని ఎలాగైనా పట్టుకుంటానని రాజ్ వెంటనే అక్కడి నుంచి బయల్దేరతాడు.


నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగిందంటే..


కావ్య ఇంట్లో పని మొత్తం చేసుకుని తండ్రి దగ్గరకి పని చేయడానికి వెళ్తానని అపర్ణని పర్మిషన్ అడుగుతుంది. ఇష్టం లేకపోయినా అపర్ణ సరే అంటుంది. ఇక సీతారామయ్య వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఆశీర్వాదం కావాలని అడుగుతుంది. ఏంటి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నావని ధాన్యలక్ష్మి కావ్యని అంటుంది.


కావ్య: ఈరోజుతో మా అమ్మవాళ్ళ కష్టాలు తీరబోతున్నాయి. కాంట్రాక్ట్ పూర్తి చేస్తే అప్పులు తీరిపోతాయి. మా ఇల్లు మా సొంతం అవుతుంది


రుద్రాణి: దుగ్గిరాల ఇంటి కోడలివి కదా నీకు అలాంటి కాంట్రాక్టులు చాలానే వస్తాయిలే


రాజ్: ఈ కాంట్రాక్ట్ విషయంలో మన ప్రమేయం ఏమి లేదత్త. గతంలో తన టాలెంట్ చూసి కాంట్రాక్ట్ ఇచ్చారు అంతే


ఇక రాజ్ కావ్యని తీసుకెళ్ళి పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తానని పెద్దాయనకి చెప్తాడు. అటు కళ్యాణ్ అనామిక కలవమని చెప్పేసరికి చాలా హుషారుగా బయల్దేరతాడు. అప్పుడే అప్పు ఫోన్ చేస్తుంది. ముందు అనామిక దగ్గరకి వెళ్ళి విషయం తెలుసుకుని ఆ తర్వాత అప్పుని కలిసి సర్ది చెప్పొచ్చులే అనుకుంటాడు. రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్న అనామిక దగ్గరకి కళ్యాణ్ వెళతాడు. కాసేపు తనకి పెళ్లి, వెడ్డింగ్ కార్డ్ ఇది అంటూ అనామిక కళ్యాణ్ ని ఉడికిస్తుంది. ఇక చివరకి కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రపోజ్ చేస్తున్నట్టుగా గ్రీటింగ్ కార్డ్ ఉంటుంది. కవితలు మాత్రమే కాదు వాటిని రాసే అబ్బాయిని కూడా ప్రేమిస్తానని చెప్పి తన ప్రేమని వ్యక్తపరుస్తుంది. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.


ALso Read: రిషి కోసం రూమ్ సిద్ధం చేసిన వసు, కొత్త డ్రామా స్టార్ట్ చేసిన దేవయాని!


కావ్య బొమ్మలకి రంగులు వేస్తూ బిజిబిజీగా ఉంటుంది. రుద్రాణి కొడుక్కి ఫోన్ చేసి కావ్యని దెబ్బ కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్ దొరికిందని చెప్తుంది. కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి వీల్లేదని ఎలాగైనా అది పోయేలా చేయమని పురమాయిస్తుంది. దీంతో రాహుల్ రౌడీలని పంపించి విగ్రహాలు మాయం చేస్తానని చెప్తాడు.