Krishnamma kalipindi iddarini July 15th: పెళ్లి మండపం దగ్గర సౌదామిని సునందతో గౌరీ గురించి  రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఈ టైంలో వెళ్లటం అవసరం ఏంటి అని అందరికి మండేవిధంగా మాట్లాడుతుంది. అయిన కళ్ళు లేని ఈశ్వర్ కు నా కూతురు కంటే గొప్పదాన్ని తీసుకొస్తాను అన్నావు.. దాంతో ఆదిత్య తో పెళ్లి చేయమని అడిగితే మరెవరికో ఇచ్చి చేస్తున్నావు అంటూ కానీ ఇప్పుడు గౌరీ   వేరొకరితో లేచిపోయింది అని పదేపదే ఆ మాట అంటూ మరింత రెచ్చగొడుతుంది సౌదామిని.


సునంద వెంటనే సౌదామినిపై అరుస్తుంది. నోటికొచ్చినట్లు వాగకు అని తిడుతుంది. కానీ సౌదామిని మాత్రం లేచిపోయిన దానిని లేచిపోయింది అనకుండా ఇంకేమంటారు అని అంటుంది. ఒకవైపు గొడవ జరుగుతుంటే మరోవైపు అఖిల చూస్తుంటే పెళ్లి జరగదేమో.. ఇక ఈ ఇంటి కోడలు కాలేనేమో అని భయపడి వెంటనే తన తల్లితో ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ పెళ్లి జరిగేటట్టు చేయమని సునందను అడగమని అంటుంది.


దాంతో భవాని ఒకవైపు వాళ్ళు వాళ్ళ బాధపడుతుంటే మనం ఎలా అడుగుతాము అని ఉంటుంది. ఇక సౌదామిని మాత్రం ఆగకుండా రెచ్చిపోయి అందరికీ కోపం తెప్పించే విధంగా మాట్లాడుతుంది. ఇక అఖిల మాత్రం తన తల్లికి పెళ్లి జరిగితే ఆస్తంత దాని చేతికి వస్తుంది అని ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి అని కొన్ని మాటలు చెప్పటంతో భవాని.. వెంటనే సునందని పిలిచి ఈ సమయంలో ఇలా అడగాలో లేదో తెలియదు కానీ.. ఆదిత్యతో అఖిల పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అని అంటుంది.


సునంద మీరు ఏం మాట్లాడుతున్నారు.. ఈ సమయంలో పెళ్లి ఎలా చేస్తాము అనటంతో వెంటనే భవాని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. పెళ్లి ఆగిపోతే అఖిల ఏమైనా చేసుకుంటుంది అని అనటంతో గౌరీ వచ్చిన వెంటనే ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తాను అని సునంద అంటుంది. ఇక గౌరీ రాకపోతే ఎలా అని అనటంతో.. ఒక తల్లి మాట్లాడిన మాటలు ఇవేనా అని అన్నట్లు ఆశ్చర్యపోతారు వాళ్లంతా.  ఇక భవాని ఎలాగైనా పెళ్లి చేయండి అంటూ బ్రతిమాండటంతో వెంటనే ఆనందయ్య భవాని చెంప పగలగొడతాడు.


నోరు మూయమని గట్టిగా అంటాడు. ఒకవైపు కూతురు ఏ పరిస్థితిలో ఉందో.. ఎక్కడికి వెళ్లిందో అన్న బాగా లేకుండా పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అంటూ తిడతాడు. గమ్ముగా ఉండు అని అంటాడు. మరి నేనేం చేయాలి నాన్న అని అఖిల అంటుంది. పెళ్లి ఆగిపోతే నేను అవమానాన్ని తట్టుకోలేను అని బెదిరిస్తుంది. వెంటనే మండపం దగ్గరికి వెళ్లి చాకు తీసుకొని ముహూర్తం దాటే వరకు గౌరీ రాకపోతే పెళ్లి చేయాలి లేదంటే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది.


దాంతో అందరూ భయపడి పోతారు. ఇక సౌదామిని మాత్రం.. అక్కడ గౌరీ రాలేదు ఇక్కడ అఖిల చచ్చిపోతుంది.. అప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా నీ పెళ్లి ఆదిత్యతో జరుగుతుంది అని అంటుంది. ఇక అఖిల బెదిరించడంతో ఈశ్వర్ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతాడు. మరోవైపు తాళిబొట్టు పట్టుకొని కాసేపట్లో గౌరీ తన భార్య అయిపోతుంది అని సూరిబాబు మురిసిపోతూ ఉంటాడు.


అదే సమయంలో సౌదామిని నిప్పు పెట్టే ప్రయత్నం చేయటంతో.. వెంటనే సునంద తనపై అరుస్తుంది. ఇంకోసారి ఆ మాటలు అంటే ఈశ్వర్ తట్టుకోలేడు అని ఈశ్వర్ వైపు చూడటంతో అక్కడ ఈశ్వర్ కనిపించడు. ఎక్కడ వెతికిన ఈశ్వర్ లేకపోయేసరికి కుప్పకూలిపోతుంది సునంద. పండగలాగ జరగాలనుకున్న ఈ పెళ్లి ఇలా అయింది ఏంటి అని బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక గౌరీ స్పృహలో నుండి బయటకు రావడంతో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు సూరిబాబు.


also read : Prema Entha Madhuram July 15th: దోష పూజ చేయించుకుంటున్న అను, ఆర్య.. నిప్పు పెట్టడానికి సిద్ధమైన మాన్సీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial