Krishnamma kalipindi iddarini July 20th: వంట గదిలో అఖిల, గౌరి పాయసం చేయటానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక గౌరీని చూసి అఖిల కూడా అలాగే చేస్తుంది. నీకు పాయసం చేయడం రాదు కదా నేను కూడా నీకు చేసి పెడతాను అని గౌరీ అనడంతో అక్కర్లేదు అని వెటకారం గా అంటుంది అఖిల. ఆ తర్వాత గౌరీ పాలు పోయి మీద పెట్టి పక్కకు వెళ్లి ఏదో పని చేస్తూ ఉండగా.. వెంటనే అఖిల  తను పాయసం చేసి అందరి ముందు మంచి పేరు తెచ్చుకోవాలి అని.. గౌరీని అందరి చేత అవమానించాలి అని వెంటనే నిమ్మకాయ తీసుకొని ఆ పాలల్లో పిండుతుంది.


ఇక గౌరీ వచ్చి చూసేసరికి పాలు పగిలిపోతాయి. పాలు పొంగించి పాయసం చేసి దేవుడి దగ్గర పెడదామంటే పాలు పగిలాయి ఏంటి అని బాధపడుతూ ఉండగా వెంటనే అఖిల అడుగుపెట్టిన మొదటి రోజే ఇలా అయ్యిందంటే ముందు ముందు ఇంకెన్ని అవుతాయో అని అపశకున మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక అఖిల పాయసం చేసుకొని అందరి దగ్గరికి వెళ్లి పాయసం రెడీ అని అంటుంది.


ఆ తర్వాత దేవుడి దగ్గర పెడుతుంది. సునంద ఏమి మాట్లాడకపోయేసరికి అఖిల కనిసం తనను మెచ్చుకోవటం లేదు అని కోప్పడుతుంది. ఇక గౌరీ రాలేదు ఏంటి అనటంతో వంట గదిలోనే ఉంది అని చెబుతుంది అఖిల. గౌరీ రావడానికి ఆలస్యం అవుతుంది నేను పూజ చెయ్యనా అని అఖిల అనటంతో వెంటనే సునంద వాళ్ళ అత్త నువ్వెలా చేస్తావు.. ఏదైనా ఇంటి పెద్ద కోడలే చేయాలి అని అనటంతో అఖిల సైలెంట్ అవుతుంది.


గౌరీ పాయసం తీసుకుని రావటంతో అఖిల షాక్ అవుతుంది. మరో పాల ప్యాకెట్ కూడా లేదు ఎలా చేసింది అని ఆశ్చర్య పోతుంది. తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తుంది. కాసేపు తర్వాత అందరికీ గౌరీ పాయసం ఇస్తుంది. గౌరీ చేసిన పాయసం తినటానికి ఈశ్వర్ ఆరాటపడుతుండటంతో.. వెంటనే తన తాతయ్య ఇప్పటినుంచి భార్యాభర్తలు చెరి సమానంగా పంచుకోవాలి అని అంటాడు.


దాంతో ఈశ్వర్ గౌరీ కి తినిపించడం గౌరీ ఈశ్వర్ కి తినిపించడం జరుగుతుంది. ఆదిత్య దంపతులు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. మరోవైపు సౌదామినిపై కూతురు బాగా అరుస్తూ ఉంటుంది. ఆదిత్యతో పెళ్లి చేస్తానని చెప్పి ఇలా చేశావు అంటూ తిడుతుంది. ఇక్కడ మనం ఉండి అవమాన పడటం తప్ప మరేమీ లేదు అని వెంటనే సింగపూర్ కి వెళ్దాము అని అంటుంది.


అక్కడికి వెళ్లి ఏం చేస్తాము అని సౌదామిని అనటంతో.. ఇల్లు, బిజినెస్ లు ఉన్నాయి కదా అని అంటుంది. అవి ఇంకెక్కడున్నాయి మీ నాన్న చేసిన బెట్టింగ్లో అవన్నీ కోల్పోయాము. ఇప్పుడు మనకు ఈ బట్టలు తప్ప ఏమీ లేవు ఈ ఇల్లు వదిలి వెళ్తే రోడ్డున పడ్డ పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉందా అని అంటుంది.  అంతేకాకుండా ఈ ఆస్తులలో తన వాటా ఉంటుంది కాబట్టి దాని గురించి అడుగుతాను అని అంటుంది.


ఇక ఈశ్వర్ దగ్గరికి గౌరీ టీ తీసుకొని వస్తుంది. ఇక ఈశ్వర్ నవ్వటంతో ఏం జరిగింది అని గౌరీ అంటుంది. గతంలో ఇదే ప్లేస్ లో నిలబడి ఉన్నప్పుడు ఆదిత్య నీతో ఉంటే ఎలా ఉంటుందో అనేది చెప్పాడు మాట్లాడుతూ ఉంటాడు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుతూ ఉండగా వారిని అలా చూసి అఖిల కుళ్ళుకుంటుంది.


also read it : Madhuranagarilo July 20th: కాబోయే భర్తకు మాటలు పడేలా చేసిన సంయుక్త.. తనకు పెళ్లి కాలేదని శ్యామ్ కు నిజం చెప్పిన రాధ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial