హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి తెలిసిందే. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో నమోదు చేసుకున్నారు. అయితే అది నిజం కాదని.. ఇసుక వలనే బైక్ స్కిడ్ అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో పోలీసుల విచారణలో తేలుతుంది. కానీ విచారణకు ముందే కొన్ని టీవీ ఛానెల్స్ సాయి ధరమ్ తేజ్ విషయంలో నెగెటివ్ ప్రచారం చేశాయి. 


Also Read : Sai Dharam Tej Health Update: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల


రెండు రోజులుగా సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన రకరకాల విశ్లేషణలతో హోరెత్తిస్తున్నాయి. అందులో ఓ టాప్ న్యూస్ చానె చేస్తున్న హడావిడి జర్నలిజం విలువలకు దూరంగా సాగుతోందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ కూడా సదరు ఛానెల్స్ పై మండిపడుతూ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. 


''హాట్స్ ఆఫ్ తమ్ముడు సాయి ధరమ్ తేజ్.. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్.. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు  వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను'' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ప్రముఖ ఛానెల్ ఇన్ పుట్ ఎడిటర్ హరీష్ ట్వీట్ పై స్పందించారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. అదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.