ఆగస్టు 1నుంచి సినిమా షూటింగులు బంద్ అయిన సంగతి తెలిసిందే. మధ్యలో ఆగస్టు 22 నుంచి షూటింగ్స్ మొదలవుతాయని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెప్పారు నిర్మాత దిల్ రాజు. ఇక ఇప్పుడు బంద్ ను ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ పునః ప్రారంభించనున్నారు. లోకల్ లో సెప్టెంబర్ 1 నుంచి, ఫారెన్ లొకేషన్స్ లో అయితే ఆగస్టు 25 నుంచే షూటింగ్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. 


మొత్తానికి టాలీవుడ్ లో బంద్ ఎత్తేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. నిన్ననే 'పుష్ప2' సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మరికొన్ని రోజుల్లో మహేష్, త్రివిక్రమ్ సినిమా కూడా మొదలుకానుంది. రాబోయేవన్నీ క్రేజీ సినిమాలు కావడంతో.. ఈ బంద్ కారణంగా ఎఫెక్ట్ అవుతాయని అనుకున్నారు. ఫైనల్ గా బంద్ ను విరమించుకోవడంతో ఈ సినిమాల షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది. 


కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కీలక సభ్యుడు దిల్ రాజు ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవేంటంటే.. 


ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు:
ఓటీటీల విడుదలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు దిల్ రాజు. థియేట్రికల్ రిలీజ్ తరువాత ఎనిమిది వారాలకు లేదంటే 50 రోజుల తరువాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే ఓటీటీలతో అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను ఈ రూల్ వర్తించదని వెల్లడించారు. మిగిలిన సినిమాల విషయంలో ఈ రూల్ కచ్చితంగా పాటించాల్సిందేనని తెలిపారు. 


టికెట్ రేట్లు తగ్గిస్తాం:
కొన్నాళ్లుగా సినిమా టికెట్ రేట్లు పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ తగ్గడానికి కూడా పెరిగిన టికెట్ రేట్లే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు దిల్ రాజు. సినిమా టికెట్ రేట్లు, అలానే ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గించాలని థియేటర్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. 


Dil Raju about Telugu film industry Problems: నిర్మాణ ఖర్చులు వృధాపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో, ఛాంబర్ తో ఒప్పందం కుదిరిందని.. దర్శకులు, ఇతర విభాగాలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మరో నాలుగు రోజులపాటు వరుసగా మీటింగ్స్ కొనసాగుతాయని చెప్పారు. ఫెడరేషన్ తో మరో రెండు మీటింగ్స్ ఉన్నట్లు తెలిపారు. కార్మికుల జీతాలు పెంచడానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ వర్కింగ్ కండీషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు.


ఇదే సమయంలో హిందీ సినిమా ఇండస్ట్రీ సౌత్ సినిమా ఇండస్ట్రీల వైపు చూస్తుందని.. మనం తీసుకున్న నిర్ణయాలను వారు అధ్యయనం చేసి.. తమ ఇండస్ట్రీలో ఆ రూల్స్ ను తీసుకురావాలని అనుకుంటున్నాయని చెప్పారు. సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.  


Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి


Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ