'బాహుబలి'కి ఏడేళ్లు: 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి' సినిమా విడుదలై ఈరోజుకి ఏడేళ్లు. దీంతో అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ప్రభాస్, రాజమౌళిలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి చెప్పిన విషయాలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1 ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే!





 

బ్యాంకాక్ చెక్కేసిన పూజాహెగ్డే:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వెకేషన్ కి వెళ్లింది. మరో నెల రోజుల పాటు హాయినా ఎంజాయ్ చేయనుంది. టూర్ కి వెళ్తోన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'నెల రోజులు.. మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఛలో #gypsiegirl' అంటూ రాసుకొచ్చింది. ముందుగా బ్యాంకాక్ కి వెళ్లింది పూజా. అక్కడ కొన్నాళ్లు గడిపి ఆ తరువాత తన టూర్ ని కంటిన్యూ చేయనుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లతో సినిమాలు చేస్తుంది. అలానే మహేష్ బాబు సినిమా కూడా ఒప్పుకుంది.