టాలీవుడ్ టాప్ హీారోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ లో ఆయనకున్న పాపులారిటీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో రామ్ చరణ్ తో కలసి నటించాడు. ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో కూడా విడుదల చేసింది మూవీ టీమ్. అక్కడ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాకు విరామం రావడంతో ఆయన ప్రస్తుతం యాడ్స్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. 


ఇటీవలే ఎన్టీఆర్ ఓ ప్రముఖ మీట్ డెలివరీ సంస్థకు సంబంధించిన యాడ్ లో  కనిపించారు. అయితే ఈ యాడ్ చాలా జెట్ స్పీడ్ లో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ యాడ్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కేవలం తెలుగులో వచ్చే యాడ్స్ మాత్రమే చేస్తున్నారు. పైగా ఈ యాడ్ కోసం రూ.3 కోట్లు నుంచి రూ.4 కోట్లు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్ తో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. 


అయితే ఎన్టీఆర్ ఇంత తక్కువకి యాడ్ చేయడం వెనుక కారణం కూడా ఉందంటున్నారు సినీ నిపుణులు. తారక్ గతంలోనూ పలు యాడ్స్ లలో చేసినా అవి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన ఇంకా ఇలాంటి యాడ్స్ లో బిజీ అవ్వాలి. మొదట ఇలాంటి ఫేమస్ సంస్థలలో యాడ్స్ చేస్తూ క్రమేపీ ఇండియా లెవల్ లో యాడ్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట తారక్. 


మరోవైపు సినిమాల విషయంలోనూ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తోన్న సినిమాపైనాా భారీ అంచనాలే ఉన్నాయి. మొదట్లో ఈ సినిమా ఆగిపోతున్నట్లు వార్తలు వచ్చినా.. తర్వాత సినిమా త్వరలో పట్టాలెక్కనుందని క్లారిటి ఇచ్చింది మూవీ టీమ్. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ మొదలుపెట్టే అశకాశాలు ఉన్నాయి.


ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే కథను సిద్ధం చేస్తున్నారు కొరటాల. మొదట ఫ్యాక్షన్ బ్యాకడ్రాప్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత కొరటాల మూల కథ లో మార్పులు చేసి ఆ లైన్ ను ఎన్టీఆర్ కు వినిపించారట. అది కాస్తా ఎన్టీఆర్ కు నచ్చడంతో స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నాడట కొరటాల. మెడికల్ మాఫియాలో ఉండే చీకటి కోణాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారట. ఈ భారీ చిత్రాన్ని మొత్తం 9 భాషల్లో విడుదల చేయనున్నారని టాక్. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే ఆశలు పెట్టుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరి ఈ సినిమా ఎలా ఉంటుదో చూడాలి. ప్రస్తుతానికైతే తారక్ పలు యాడ్స్ షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారు.


Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ : 'అల్లరి' నరేష్ ఎన్నికల సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారా? లేదా?