కొన్నాళ్లక్రితం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రధాని మోదీ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.


ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లో కేవలం హిందీ వెర్షన్ విడుదల కాగా.. ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 13న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. 


ఈ సినిమా రిలీజ్ తో జీ5 సబ్ స్క్రిప్షన్స్ పెరగడం ఖాయం. చాలా మంది సౌత్ ఆడియన్స్ ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను చూడాలనుకుంటున్నారు. కాబట్టి వ్యూస్ ఓ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. 


కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పట్లో జరిగిన ఈ మారణకాండను కళ్లకు కట్టినట్లుగా చూపించారు దర్శకుడు. 


Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే