తమిళ టాప్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘వరిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళపతి ఫ్యాన్స్ కు  సినిమా యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.  గురువారం ‘వరిసు’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.






‘రంజితమే..’ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ


‘రంజితమే.. రంజితమే..’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. పాటకు తగ్గట్లుగానే విజయ్ మాస్ స్టెప్పులతో దుమ్ములేపాడు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. తమన్ సంగీతం, విజయ్ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాంగ్ ప్రోమో విడుదల కావడంతో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.






వచ్చే ఏడాది జనవరి 12న విడుదల


ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమాకు వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Read Also: బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు