మిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతాయి. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈసారి డైరెక్టు తెలుగు సినిమాలో నటిస్తున్నాడు విజయ్. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీలోని ‘సోల్‌ ఆఫ్ వారసుడు’ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాటను ప్రముఖ సింగర్ చిత్ర ఆలపించారు. ‘అమ్మమ్మో నేనేమి వింటినమ్మా.. వాకిల్లి నిలిచింది వాస్తవమా..’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.  ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించారు. థమన్ సంగీతం అందించారు.

  


ఇప్పటికే ‘వారసుడు’ సినిమా నుంచి ‘రంజితమే’, ‘ది దళపతి’ పాటలను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక మూవీ నుంచి మూడోొ పాటగా ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ వింటుంటే సినిమాలో ఈ పాటే ప్రధాన ఆకర్షణగా కనిపించనుందని తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ తో సాగే ఈ పాటలో లిరిక్స్ కూడా మనసును హత్తుకునేలా ఎమోషనల్ గా రాశారు రామజోగయ్య. ఇక థమన్ మ్యూజిక్ తో పాటను వేరే లెవల్ కు తీసుకెళ్లారు. మొత్తంగా ఈ పాటతో ‘వారసుడు’ సినిమాపై మరింత ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్, ట్రైలర్ లు విడుదల కాలేదు. అయినా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకే మూవీ టీమ్ కూడా హడావిడి లేకుండా మెల్లగా ఒక్కో అప్డేట్ ను రివీల్ చేస్తూ వస్తున్నారు. 



ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డాడు హీరో విజయ్. ఆయన నటించిన ‘తుపాకీ’ సినిమా నుంచి ‘విజిల్’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ సినిమాల వరకూ చాలా సినిమాలు తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్ మార్కెట్ బాగానే పెరిగింది. అందుకే ఈసారి తెలుగు దర్శక నిర్మాతలతో కలసి పనిచేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారాయన. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రెండు పాటలు విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. త్వరలోనే సినిమా టీజర్, ట్రైలర్ కూడా విడుదల చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ‘వారసుడు’ అభిమానులు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.



Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు