‘అలా వైకుంఠపురంలో’ మూవీ ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనేందుకు ఆ మూవీని హిందీలో కూడా డబ్బింగ్ చేసి.. థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధం చేశారు. అయితే, ఆ మూవీని బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హిందీలో రీమేక్ చేస్తుండటంతో డబ్బింగ్ వెర్షన్‌ను నిలిపేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘అలా వైకుంఠపురంలో’ మూవీని హిందీలో ‘షెహజాదా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గురువారం ‘షెహజాదా’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నివసిస్తోంది. కార్తీక్ ఆర్యన్ పెంపుడు తండ్రి పాత్రలో పరేష్ రావల్, తల్లి పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తున్నారు. షెహజాదా చిత్రానికి రోహిత్ ధావన్ దర్శత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ ధావన్ ఎవరో కాదు, స్వయానా వరుణ్ ధావన్ సోదరుడు. హిందీలో ‘షెహజాదా’ అంటే మహారాజా కొడుకు అని అర్థం.  






ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘అలా వైకుంఠపురంలో’ కొన్ని సీన్లను కాపీ పేస్ట్ చేసినట్లే ఉన్నాయి. అయితే, సుశాంత్ పాత్రలో మాత్రం మార్పులు చేశారు. సుశాంత్ పాత్ర ఆ మూవీలో కాస్త మూడీగా కనిపించినట్లు ఉంటే.. ఇందులో మాత్రం ఫన్నీగా మార్చేశారు. అలాగే, మరికొన్ని కామెడీ సీన్లు కూడా కథలో ఇరికించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు తగినట్లుగా కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇందులో ‘నెపొటిజమ్’ ప్రస్తావన కూడా వచ్చింది. మొత్తంగా చూస్తే.. కార్తీక్ ఆర్యన్ కూడా మంచి ఎనర్జీతో యాక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే, తెలుగువారు అల్రెడీ.. బన్నీని చూసేశారు కాబట్టి.. ప్రతి సీన్‌ను బన్నీతోనే పోల్చుకొనే అవకాశం ఉంది. అయితే, క్యారెక్టర్ మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తే. మరి, ఎంతవరకు ఈ మూవీ అలరిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 10వ తేదీన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.



Read Also: ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ డీ-ఆక్టివేట్, హర్ట్ అయ్యే ఇలా చేశారా?